జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షునిగా సంక్రు నాయక్ నియామకం
జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షునిగా సంక్రు నాయక్ నియామకం
Bandi Kiran Kumar
భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులుగా తుంగతుర్తి మండలము గొట్టిపర్తి గ్రామానికి చెందిన మాలోత్ సంకృనాయక్ ను నియమిస్తూ బిజెపి జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి నియామకపత్రములు అందజేశారు.ఈ సందర్భముగా సoక్రు నాయక్ మాట్లాడుతూ... పార్టీ నాపై ఉంచిన ఈ బాధ్యత గిరిజనుల అభ్యున్నతి కోసం పాటు పడతానని,అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను, విధానాలను జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన తండాలలో అభివృద్ధి పరుస్తానని, బీజేపీ నీ గిరిజనులకు చేరువ చేస్తానని హామీ ఇచ్చారు .తనకు ఈ పదవి రావడానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు గారికి రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షులు రవి నాయక్ గారికి జిల్లా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, బిజెపి నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడియం రామచంద్రయ్య, రంగరాజు రుక్మారావు, మరియు జిల్లా నాయకులు మేడబోయిన యాదగిరి,కంచర్ల నరసింహారెడ్డి, దీనదయాల్,తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి