ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనం విజయవంతం చేయాలి
ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనం విజయవంతం చేయాలి
Harish K
తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద జరిగే ఉద్యమకారుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిరమర్తి రవి పాల్గొని వాల్పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు ఉద్యమకారులకు 250 గజాల స్థలాలను అందివ్వాలని, ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలని, ఉద్యమకారులకు గౌరవంతో పాటు గుర్తింపును ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండమీది గోవిందరావు నూకపంగు ఈదయ్య, సైమన్, పిడమర్తి బ్రహ్మం, మాతంగి సురేష్, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి