త్రిబుల్ ఐటీ విద్యార్థిని చికిత్సకు పూర్తి సహాయం అందించాలి: మహారెడ్డి భూపాల్ రెడ్డి
త్రిబుల్ ఐటీ విద్యార్థిని చికిత్సకు పూర్తి సహాయం అందించాలి: మహారెడ్డి భూపాల్ రెడ్డి
Krishna
బాసర త్రిబుల్ ఐటీలో విద్యనభ్యసిస్తున్న మనూర్ మండలం రాయిపల్లి గ్రామానికి చెందిన ఇస్మాయిల్ కుమార్తె అస్మిత ప్రమాదవశాత్తు భవనం పై నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయపడి హైదరాబాద్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్న ఆయన, నిరుపేద కుటుంబానికి చెందిన అస్మిత ఎంతో కష్టపడి చదివి త్రిబుల్ ఐటీలో సీటు సాధించిందని, అలాంటి విద్యార్థిని ప్రమాదానికి గురికావడం బాధాకరమని అన్నారు. ఆమెకు అవసరమైన పూర్తి వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఆర్థిక సహాయం అందించడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి అస్మితకు అత్యుత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫిరోజ్, కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని అస్మిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి