Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మరమ్మతుల కోసం ఎదురుచూస్తున్న పెద్దమంతూర్ వంతెన పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 23, 2026 07:04 PM

త్రిబుల్ ఐటీ విద్యార్థిని చికిత్సకు పూర్తి సహాయం అందించాలి: మహారెడ్డి భూపాల్ రెడ్డి

త్రిబుల్ ఐటీ విద్యార్థిని చికిత్సకు పూర్తి సహాయం అందించాలి: మహారెడ్డి భూపాల్ రెడ్డి

త్రిబుల్ ఐటీ విద్యార్థిని చికిత్సకు పూర్తి సహాయం అందించాలి: మహారెడ్డి భూపాల్ రెడ్డి
June 23, 2026 05:02 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

బాసర త్రిబుల్ ఐటీలో విద్యనభ్యసిస్తున్న మనూర్ మండలం రాయిపల్లి గ్రామానికి చెందిన ఇస్మాయిల్ కుమార్తె అస్మిత ప్రమాదవశాత్తు భవనం పై నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్న ఆయన, నిరుపేద కుటుంబానికి చెందిన అస్మిత ఎంతో కష్టపడి చదివి త్రిబుల్ ఐటీలో సీటు సాధించిందని, అలాంటి విద్యార్థిని ప్రమాదానికి గురికావడం బాధాకరమని అన్నారు. ఆమెకు అవసరమైన పూర్తి వైద్య ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఆర్థిక సహాయం అందించడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి అస్మితకు అత్యుత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫిరోజ్, కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని అస్మిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News