Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వియాస్ ఫార్మాలో కెమికల్ లీక్ కలకలం పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 23, 2026 11:11 AM

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ బి. హరి సింగ్

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ బి. హరి సింగ్

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ బి. హరి సింగ్
June 23, 2026 09:25 AM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

ప్రజావాణిలో 114 దరఖాస్తుల స్వీకరణ

ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా అదనపు కలెక్టర్ బి. హరి సింగ్ జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.


ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సమర్పించే దరఖాస్తులకు సంబంధిత శాఖలు నిర్దేశిత ఫార్మాట్‌లో ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని సూచించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా, డివిజన్ స్థాయిలో స్వీకరించిన ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. పాత ప్రజావాణి పోర్టల్‌లో ఇంకా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని, కొత్తగా వచ్చే దరఖాస్తులను వెంటనే పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించినట్లు తెలిపారు.


అన్ని శాఖల డివిజనల్ అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని పేర్కొన్నట్లు తెలిపారు. స్థానిక సమస్యలు స్థానికంగానే పరిష్కారమైతే ప్రజలకు ఇబ్బందులు తగ్గుతాయని అభిప్రాయపడినట్లు తెలిపారు.


సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 114 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. వీటిలో భూ సమస్యలకు సంబంధించిన 61 దరఖాస్తులు, డీడబ్ల్యూఓ శాఖకు 12, డీపీఓ శాఖకు 6, డీఆర్‌డీఏకు 2, మిగిలిన 33 దరఖాస్తులు వివిధ శాఖలకు సంబంధించినవిగా గుర్తించి పరిష్కారం కోసం సంబంధిత శాఖలకు పంపినట్లు తెలిపారు.


కార్యక్రమంలో డీఆర్‌డీఓ పీడీ సన్యాసయ్య, సీపీఓ కిషన్ నాయక్, డీఏఓ శ్రీధర్ రెడ్డి, డీఈఓ అశోక్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News