ప్రజాసేవే లక్ష్యం సీసీ రోడ్డుకు అడ్డుగా ఉన్న కంపచెట్ల తొలగింపు
ప్రజాసేవే లక్ష్యం సీసీ రోడ్డుకు అడ్డుగా ఉన్న కంపచెట్ల తొలగింపు
Editor Desk
రామన్నపేట, : మండలంలోని నీకొమ్మయిగూడెం గ్రామం 6వ వార్డులో సీసీ రహదారికి అడ్డుగా పెరిగి ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారిన కంపచెట్లను గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి తొలగించారు. వార్డు సభ్యులు బుర్ర శ్రీజ–శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
గ్రామ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు స్పందించిన వార్డు సభ్యులు, రహదారిపై పెరిగిన చెట్ల కొమ్మలు, కంపలను తొలగించి మార్గాన్ని పరిశుభ్రంగా మార్చారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని బుర్ర శ్రీశైలం యాదవ్ తెలిపారు.
గ్రామంలో పారిశుద్ధ్యం, రహదారుల నిర్వహణ, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పన విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి