Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:44 AM

ప్రజాసేవే లక్ష్యం సీసీ రోడ్డుకు అడ్డుగా ఉన్న కంపచెట్ల తొలగింపు

ప్రజాసేవే లక్ష్యం సీసీ రోడ్డుకు అడ్డుగా ఉన్న కంపచెట్ల తొలగింపు

ప్రజాసేవే లక్ష్యం సీసీ రోడ్డుకు అడ్డుగా ఉన్న కంపచెట్ల తొలగింపు
23-06-2026 107 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, : మండలంలోని నీకొమ్మయిగూడెం గ్రామం 6వ వార్డులో సీసీ రహదారికి అడ్డుగా పెరిగి ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారిన కంపచెట్లను గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి తొలగించారు. వార్డు సభ్యులు బుర్ర శ్రీజ–శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

గ్రామ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు స్పందించిన వార్డు సభ్యులు, రహదారిపై పెరిగిన చెట్ల కొమ్మలు, కంపలను తొలగించి మార్గాన్ని పరిశుభ్రంగా మార్చారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని బుర్ర శ్రీశైలం యాదవ్ తెలిపారు.

గ్రామంలో పారిశుద్ధ్యం, రహదారుల నిర్వహణ, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పన విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజాసేవే లక్ష్యం సీసీ రోడ్డుకు అడ్డుగా ఉన్న కంపచెట్ల తొలగింపు

Article Image

రామన్నపేట, : మండలంలోని నీకొమ్మయిగూడెం గ్రామం 6వ వార్డులో సీసీ రహదారికి అడ్డుగా పెరిగి ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారిన కంపచెట్లను గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి తొలగించారు. వార్డు సభ్యులు బుర్ర శ్రీజ–శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

గ్రామ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు స్పందించిన వార్డు సభ్యులు, రహదారిపై పెరిగిన చెట్ల కొమ్మలు, కంపలను తొలగించి మార్గాన్ని పరిశుభ్రంగా మార్చారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని బుర్ర శ్రీశైలం యాదవ్ తెలిపారు.

గ్రామంలో పారిశుద్ధ్యం, రహదారుల నిర్వహణ, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పన విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News