PRINT TIME: June 23, 2026 11:14 AM
ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య
June 23, 2026 09:24 AM
2 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish K
మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వము అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకముల పంపిణీ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సర్పంచ్ యమన లింగరాజు ఉపసర్పంచ్ మద్దనాల మల్లికార్జున్ మాజీ సర్పంచి వీరబోయిన వెంకన్న మరియు వార్డు నెంబర్లు ఇతర ప్రజాప్రతినిధులు పాఠశాల హెచ్ఎంఎం సతీష్ కుమార్ ఉపాధ్యాయులు వి భరత్ బాబు లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు వి భరత్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియంలో బోధన గావించబడుతుందని, దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పిల్లల విద్యార్థుల సంఖ్యను నమోదును పెంచడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం గావించవచ్చునని, తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి