కుటుంబానికి తీరని లోటు.. ప్రభుత్వం ఆదుకోవాలి. కృష్ణయ్యకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాళి.
కుటుంబానికి తీరని లోటు.. ప్రభుత్వం ఆదుకోవాలి. కృష్ణయ్యకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాళి.
Editor Desk
రామన్నపేట: ఓ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో నిర్నెముల గ్రామం విషాదంలో మునిగిపోయింది. రామన్నపేట మండలంలోని నిర్నెముల గ్రామానికి చెందిన కన్నెబోయిన కృష్ణయ్య సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
మృతుడి భౌతిక దేహానికి మంగళవారం రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారి దుఃఖంలో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణయ్య మృతి కుటుంబానికి తీరని లోటని, ఈ విషాద ఘటన ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు.
కృష్ణయ్య మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించగా, ఆసుపత్రి ప్రాంగణం విషాద వాతావరణంలో మునిగిపోయింది. .

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి