Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:45 AM

కుటుంబానికి తీరని లోటు.. ప్రభుత్వం ఆదుకోవాలి. కృష్ణయ్యకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాళి.

కుటుంబానికి తీరని లోటు.. ప్రభుత్వం ఆదుకోవాలి. కృష్ణయ్యకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాళి.

కుటుంబానికి తీరని లోటు.. ప్రభుత్వం ఆదుకోవాలి.  కృష్ణయ్యకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాళి.
23-06-2026 99 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: ఓ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో నిర్నెముల గ్రామం విషాదంలో మునిగిపోయింది. రామన్నపేట మండలంలోని నిర్నెముల గ్రామానికి చెందిన కన్నెబోయిన కృష్ణయ్య సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

మృతుడి భౌతిక దేహానికి మంగళవారం రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారి దుఃఖంలో పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణయ్య మృతి కుటుంబానికి తీరని లోటని, ఈ విషాద ఘటన ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు.

కృష్ణయ్య మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించగా, ఆసుపత్రి ప్రాంగణం విషాద వాతావరణంలో మునిగిపోయింది. .

Sthanikam

కుటుంబానికి తీరని లోటు.. ప్రభుత్వం ఆదుకోవాలి. కృష్ణయ్యకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాళి.

Article Image

రామన్నపేట: ఓ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో నిర్నెముల గ్రామం విషాదంలో మునిగిపోయింది. రామన్నపేట మండలంలోని నిర్నెముల గ్రామానికి చెందిన కన్నెబోయిన కృష్ణయ్య సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

మృతుడి భౌతిక దేహానికి మంగళవారం రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారి దుఃఖంలో పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణయ్య మృతి కుటుంబానికి తీరని లోటని, ఈ విషాద ఘటన ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు.

కృష్ణయ్య మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించగా, ఆసుపత్రి ప్రాంగణం విషాద వాతావరణంలో మునిగిపోయింది. .

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News