Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:43 AM

కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి.

కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి.

కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి.
23-06-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆత్మకూరు

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాలలో కొత్తగా ఎన్ని అడ్మిషన్లు జరిగాయి, ప్రస్తుతం ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారు, హాజరు శాతం ఎంత ఉందనే వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గైర్హాజరైన విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా తల్లిదండ్రులతో మాట్లాడి వెంటనే పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

అనంతరం పాఠశాలలో నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, మెనూ ప్రకారమే ఆహారం అందిస్తున్నారా లేదా పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందించడంలో ఎలాంటి లోపాలు ఉండరాదన్నారు. కిచెన్, స్టోర్‌రూమ్‌లను పరిశీలించి పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి.

Article Image

ఆత్మకూరు

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాలలో కొత్తగా ఎన్ని అడ్మిషన్లు జరిగాయి, ప్రస్తుతం ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారు, హాజరు శాతం ఎంత ఉందనే వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గైర్హాజరైన విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా తల్లిదండ్రులతో మాట్లాడి వెంటనే పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

అనంతరం పాఠశాలలో నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, మెనూ ప్రకారమే ఆహారం అందిస్తున్నారా లేదా పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందించడంలో ఎలాంటి లోపాలు ఉండరాదన్నారు. కిచెన్, స్టోర్‌రూమ్‌లను పరిశీలించి పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News