కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి.
కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి.
Editor Desk
ఆత్మకూరు
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలో కొత్తగా ఎన్ని అడ్మిషన్లు జరిగాయి, ప్రస్తుతం ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారు, హాజరు శాతం ఎంత ఉందనే వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గైర్హాజరైన విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా తల్లిదండ్రులతో మాట్లాడి వెంటనే పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
అనంతరం పాఠశాలలో నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, మెనూ ప్రకారమే ఆహారం అందిస్తున్నారా లేదా పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందించడంలో ఎలాంటి లోపాలు ఉండరాదన్నారు. కిచెన్, స్టోర్రూమ్లను పరిశీలించి పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి