Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఆసియన్ చెస్ చాంపియన్ మేకల అభినవ్ జయంతి..... పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 23, 2026 08:17 PM

ప్రీ–ప్రైమరీ స్కూళ్లను అంగన్వాడీ కేంద్రాలకే అప్పగించాలి ప్రభుత్వాలకు దాసరి పాండు డిమాండ్

ప్రీ–ప్రైమరీ స్కూళ్లను అంగన్వాడీ కేంద్రాలకే అప్పగించాలి ప్రభుత్వాలకు దాసరి పాండు డిమాండ్

ప్రీ–ప్రైమరీ స్కూళ్లను అంగన్వాడీ కేంద్రాలకే అప్పగించాలి ప్రభుత్వాలకు దాసరి పాండు డిమాండ్
June 23, 2026 06:41 PM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, : అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దానిని నిర్వీర్యం చేసే చర్యలకు పాల్పడుతున్నాయని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు దాసరి పాండు విమర్శించారు. ప్రీ–ప్రైమరీ స్కూళ్లను అంగన్వాడీ కేంద్రాలకు అప్పగించి, అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలకు తగిన బడ్జెట్ కేటాయింపులు చేయకుండా ప్రభుత్వాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు.

హక్కుల అమలులో నిర్లక్ష్యం

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశ కార్మిక, ఉద్యోగ వర్గాలకు కల్పించిన హక్కులను నేటి ప్రభుత్వాలు అమలు చేయడంలో విఫలమవుతున్నాయని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో దశాబ్దాలుగా సేవలందిస్తున్న టీచర్లు, ఆయాల భవిష్యత్తును పట్టించుకోకుండా కొత్త విద్యా విధానం పేరుతో ప్రీ–ప్రైమరీ స్కూళ్లను ప్రవేశపెడుతున్నారని విమర్శించారు.

అంగన్వాడీల సేవలు మరువరానివి

గర్భిణులకు పౌష్టికాహారం అందించడం, చిన్నారులకు ప్రాథమిక విద్య బోధించడం, ప్రభుత్వానికి వివిధ రకాల సమాచారాన్ని అందించడం వంటి కీలక బాధ్యతలను అంగన్వాడీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అలాంటి ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని కోరారు.

అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసి, ప్రీ–ప్రైమరీ విద్య బాధ్యతలను వాటికే అప్పగించాలని దాసరి పాండు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మాయ కృష్ణ, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News