PRINT TIME: June 23, 2026 09:09 PM
ఆపదలో అండగా.. యాకూబ్ షరీఫ్ కుటుంబానికి షేక్ చాంద్ సాయం
ఆపదలో అండగా.. యాకూబ్ షరీఫ్ కుటుంబానికి షేక్ చాంద్ సాయం
June 23, 2026 07:25 PM
35 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట: పట్టణానికి చెందిన మహమ్మద్ యాకూబ్ షరీఫ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని టీఆర్ఎస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు, టీయూఎఫ్ ఉద్యమ నేత, హంస ఫౌండేషన్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ చాంద్ సోమవారం పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన తన వంతు సహాయంగా అరక్వింటాల్ బియ్యంతో పాటు రూ.2 వేల నగదు అందజేశారు.
ఈ సందర్భంగా షేక్ చాంద్ మాట్లాడుతూ కుటుంబ పెద్దను కోల్పోయిన యాకూబ్ షరీఫ్ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.
కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, మాజీ ఎంపీటీసీ ఎండి అమేర్, ఎండి ముషబ్, ఎండి గౌస్, ఎండి సల్మాన్, దండిగ మణి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి