Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:20 AM

పది ఫలితాల్లో మెరిసిన విద్యార్థులకు ఘన సన్మానం

పది ఫలితాల్లో మెరిసిన విద్యార్థులకు ఘన సన్మానం

పది ఫలితాల్లో మెరిసిన విద్యార్థులకు ఘన సన్మానం
23-06-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వనిపాకల జెడ్పీ హైస్కూల్‌లో నగదు ప్రోత్సాహకాలు, పుస్తకాల బహుకరణ


చిట్యాల, జూన్ 23:

విద్యార్థులు భాషా నైపుణ్యాలను పెంపొందించుకుంటే అన్ని సబ్జెక్టుల్లోనూ రాణించగలరని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) సభ్యుడు నన్నూరి ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. చిట్యాల మండలం వనిపాకల గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌లో 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు సోమవారం ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రతి విద్యార్థికి రూ.2 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందజేసి, శాలువాతో సత్కరించి పుస్తకాలను బహుమతిగా అందించారు. విద్యార్థులు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటే విద్యాభ్యాసంలో మరింత ఉన్నత ఫలితాలు సాధించవచ్చని ఉపేందర్ రెడ్డి సూచించారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనయాచారి, గ్రామ సర్పంచ్ కొన్‌రెడ్డి మహిపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ బద్దుల లింగస్వామి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొని విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల విజయాలు గ్రామానికి గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.

Sthanikam

పది ఫలితాల్లో మెరిసిన విద్యార్థులకు ఘన సన్మానం

Article Image

వనిపాకల జెడ్పీ హైస్కూల్‌లో నగదు ప్రోత్సాహకాలు, పుస్తకాల బహుకరణ


చిట్యాల, జూన్ 23:

విద్యార్థులు భాషా నైపుణ్యాలను పెంపొందించుకుంటే అన్ని సబ్జెక్టుల్లోనూ రాణించగలరని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) సభ్యుడు నన్నూరి ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. చిట్యాల మండలం వనిపాకల గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌లో 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు సోమవారం ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రతి విద్యార్థికి రూ.2 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందజేసి, శాలువాతో సత్కరించి పుస్తకాలను బహుమతిగా అందించారు. విద్యార్థులు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటే విద్యాభ్యాసంలో మరింత ఉన్నత ఫలితాలు సాధించవచ్చని ఉపేందర్ రెడ్డి సూచించారు.

కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనయాచారి, గ్రామ సర్పంచ్ కొన్‌రెడ్డి మహిపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ బద్దుల లింగస్వామి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొని విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల విజయాలు గ్రామానికి గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News