పది ఫలితాల్లో మెరిసిన విద్యార్థులకు ఘన సన్మానం
పది ఫలితాల్లో మెరిసిన విద్యార్థులకు ఘన సన్మానం
Komidala Mahender reddy
వనిపాకల జెడ్పీ హైస్కూల్లో నగదు ప్రోత్సాహకాలు, పుస్తకాల బహుకరణ
చిట్యాల, జూన్ 23:
విద్యార్థులు భాషా నైపుణ్యాలను పెంపొందించుకుంటే అన్ని సబ్జెక్టుల్లోనూ రాణించగలరని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సభ్యుడు నన్నూరి ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. చిట్యాల మండలం వనిపాకల గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు సోమవారం ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రతి విద్యార్థికి రూ.2 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందజేసి, శాలువాతో సత్కరించి పుస్తకాలను బహుమతిగా అందించారు. విద్యార్థులు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటే విద్యాభ్యాసంలో మరింత ఉన్నత ఫలితాలు సాధించవచ్చని ఉపేందర్ రెడ్డి సూచించారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనయాచారి, గ్రామ సర్పంచ్ కొన్రెడ్డి మహిపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ బద్దుల లింగస్వామి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొని విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల విజయాలు గ్రామానికి గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి