Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మరమ్మతుల కోసం ఎదురుచూస్తున్న పెద్దమంతూర్ వంతెన పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 23, 2026 07:07 PM

తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలకు వెంపటి పాఠశాల విద్యార్థుల ఎంపిక

తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలకు వెంపటి పాఠశాల విద్యార్థుల ఎంపిక

తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలకు వెంపటి పాఠశాల విద్యార్థుల ఎంపిక
June 23, 2026 05:02 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంపటి నుండి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినలుగురు విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలకు ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకుపుల్లూరు శివకేశవ, కరీంనగర్ క్రీడా పాఠశాలకుమాచర్ల సహస్ర క్యాస్ట్రో, వరంగల్ క్రీడా పాఠశాలకుమడి పెద్ది వివేక్, రామనబోయిన ఈషఎంపిక కావడం జరిగింది పాఠశాల ప్రధానోపాధ్యాయులు భీవనపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూపాఠశాలలో చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం, విద్యార్థులలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం వల్లే ఈ విజయం సాధ్యమైందని,

తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో ప్రవేశం పొందడం ద్వారా విద్యార్థులకు ఉన్నత స్థాయి క్రీడా శిక్షణ, ఆధునిక సౌకర్యాలు, నిపుణుల పర్యవేక్షణలో సాధన చేసే అవకాశం లభించనుందని, భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిల్లో రాణించే అవకాశం వచ్చిందని,పాఠశాల విద్యార్థులు రాష్ట్ర క్రీడా పాఠశాలకు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని,విద్యార్థుల కృషి,తల్లిదండ్రుల సహకారం,ఉపాధ్యాయుల అంకితభావం కలిసి ఈ విజయాన్ని అందించాయని అన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి, విద్యార్థులను అభినందించి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు,గ్రామం నుండి రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాలలకు విద్యార్థులు ఎంపిక కావడం గర్వకారణం అని భవిష్యత్తులో వీరు రాష్ట్రం,దేశం గర్వపడే క్రీడాకారులుగా ఎదగాలని కోరుకుంటున్నామని తల్లిదండ్రులు అన్నారు,ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూవిద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు పాఠశాల స్థాయిలో నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్నామని, విద్యతో పాటు క్రీడల్లోనూ అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేకచొరవతీసుకుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మల్లెపాక రవీందర్, గట్టు మాధవి, నిమ్మరబోయిన నవీన, బండారు భవాని, జీడి అనిల్ కుమార్, మిట్టగడుపుల విక్రం, మాలోత్ కృష్ణ, గుండ్ల ఆంజనేయులు, ప్రీ ప్రైమరీ టీచర్ రామనబోయిన మౌనిక, ఆయా అబ్బ గాని మంజుల, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News