యాదాద్రి భువనగిరి
యువత భవిష్యత్తును నాశనం చేసే డ్రగ్స్,గంజాయి వంటి మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని పోలీసు అధికారులు సూచించారు. భువనగిరి పట్టణంలోని టైమ్స్ జూనియర్ కళాశాలలో భువనగిరి పట్టణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో టౌన్ సిఐ రమేష్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు ఆరోగ్యంతో పాటు భవిష్యత్తును కూడా దెబ్బతీస్తాయని తెలిపారు.విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని సూచించారు.అనంతరం విద్యార్థులతో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ లక్ష్మీనర్సయ్య,పోలీసు సిబ్బంది,కళాశాల అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి