విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ సమరశంఖం. పాఠశాలల బంద్కు విశేష స్పందన
విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ సమరశంఖం. పాఠశాలల బంద్కు విశేష స్పందన
Editor Desk
రామన్నపేట: విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సమరశంఖం పూరించింది. ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల దృష్టికి విద్యార్థుల సమస్యలను తీసుకెళ్లే క్రమంలో సోమవారం ZPHS లోయపల్లి, చాలెంజ్ ఐసీఎఫ్, శుభోదయం విద్యా మందిర్ పాఠశాలలను బంద్ చేయించి నిరసన కార్యక్రమం నిర్వహించింది.
విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక వసతులు, మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని, వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు.
"విద్యార్థుల సమస్యలపై రాజీ లేదు.. విద్యార్థుల భవిష్యత్తే మా లక్ష్యం" అనే నినాదాలతో కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు చెరుకు జగదీష్ గౌడ్, మోర శ్రీకాంత్, బొడ్డుపల్లి ప్రకాష్, ఆంబోత్ రవి నాయక్, కారింగు శివ తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి