Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:43 AM

విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ సమరశంఖం. పాఠశాలల బంద్‌కు విశేష స్పందన

విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ సమరశంఖం. పాఠశాలల బంద్‌కు విశేష స్పందన

విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ సమరశంఖం. పాఠశాలల బంద్‌కు విశేష స్పందన
23-06-2026 136 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సమరశంఖం పూరించింది. ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల దృష్టికి విద్యార్థుల సమస్యలను తీసుకెళ్లే క్రమంలో సోమవారం ZPHS లోయపల్లి, చాలెంజ్ ఐసీఎఫ్, శుభోదయం విద్యా మందిర్ పాఠశాలలను బంద్ చేయించి నిరసన కార్యక్రమం నిర్వహించింది.

విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక వసతులు, మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని, వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు.

"విద్యార్థుల సమస్యలపై రాజీ లేదు.. విద్యార్థుల భవిష్యత్తే మా లక్ష్యం" అనే నినాదాలతో కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు చెరుకు జగదీష్ గౌడ్, మోర శ్రీకాంత్, బొడ్డుపల్లి ప్రకాష్, ఆంబోత్ రవి నాయక్, కారింగు శివ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ సమరశంఖం. పాఠశాలల బంద్‌కు విశేష స్పందన

Article Image

రామన్నపేట: విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సమరశంఖం పూరించింది. ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల దృష్టికి విద్యార్థుల సమస్యలను తీసుకెళ్లే క్రమంలో సోమవారం ZPHS లోయపల్లి, చాలెంజ్ ఐసీఎఫ్, శుభోదయం విద్యా మందిర్ పాఠశాలలను బంద్ చేయించి నిరసన కార్యక్రమం నిర్వహించింది.

విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక వసతులు, మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని, వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు.

"విద్యార్థుల సమస్యలపై రాజీ లేదు.. విద్యార్థుల భవిష్యత్తే మా లక్ష్యం" అనే నినాదాలతో కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు చెరుకు జగదీష్ గౌడ్, మోర శ్రీకాంత్, బొడ్డుపల్లి ప్రకాష్, ఆంబోత్ రవి నాయక్, కారింగు శివ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News