PRINT TIME: June 23, 2026 09:45 PM
బెయిల్ కోసం బేరం.. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ. రూ.50 వేల లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ ఎస్ఐ
బెయిల్ కోసం బేరం.. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ. రూ.50 వేల లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ ఎస్ఐ
June 23, 2026 08:11 PM
20 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్: గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ వీ. నర్సింహులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కారు. స్టేషన్ బెయిల్ మంజూరు చేసి, భవిష్యత్తులో ఎలాంటి వేధింపులు ఉండవని చెప్పేందుకు ఫిర్యాదుదారుడి నుంచి రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.
ఈ మేరకు తొలి విడతగా రూ.50 వేల నగదు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. నిందితుడిని నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచగా, కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
అవినీతికి చెక్ చెప్పిన ఏసీబీ ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి లంచాలు డిమాండ్ చేసినా ప్రజలు వెంటనే ఏసీబీని ఆశ్రయించాలని అధికారులు సూచించారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి