హక్కుల సాధనకు ఒక్కతాటిపైకి రావాలని పిలుపు. జూలై 2న ఎల్బీ నగర్లో ఆత్మీయ సమ్మేళనం
హక్కుల సాధనకు ఒక్కతాటిపైకి రావాలని పిలుపు. జూలై 2న ఎల్బీ నగర్లో ఆత్మీయ సమ్మేళనం
Editor Desk
హైదరాబాద్,
మాదిగల ఐక్యత, హక్కుల సాధన, రాజకీయ సాధికారత లక్ష్యంగా జూలై 2న హైదరాబాద్లోని మన్సూరాబాద్ కామినేని చౌరస్తా వద్ద నిర్వహించనున్న ఎల్బీ నగర్ మాదిగ మహాశక్తి ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు.
మాదిగల సమస్యల పరిష్కారం, రాజకీయ ప్రాధాన్యం, సామాజిక న్యాయం, యువతకు అవకాశాలు వంటి అంశాలపై సమ్మేళనంలో చర్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మాదిగలు, యువకులు, మహిళలు, మేధావులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
మాదిగల ఐక్యతే సమాజ అభ్యున్నతికి బలమైన పునాది అని పేర్కొంటూ, హక్కుల సాధన కోసం అందరూ ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రుద్రవరం యాదగిరి, ఈదుగుల పరుశురాం మాదిగ, పి. వినోద్, పి. శేఖర్, తలయాల కృష్ణ, మెడి ఎల్లయ్య, జల్ల వెంకటేశం, మీసాల కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి