Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:46 AM

రైతు సంరక్షణ కేంద్రంలో విత్తన మేళా పంటల సాగుపై అవగాహన సదస్సు

రైతు సంరక్షణ కేంద్రంలో విత్తన మేళా పంటల సాగుపై అవగాహన సదస్సు

రైతు సంరక్షణ కేంద్రంలో విత్తన మేళా  పంటల సాగుపై అవగాహన సదస్సు
23-06-2026 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణ కేంద్రంలో

రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడులు సాధించాలని మేయర్ బుర్ర చైతన్య శ్రీనివాస్ అన్నారు. రైతు సంరక్షణ కేంద్రంలో నిర్వహించిన విత్తన మేళా – పంటల సాగుపై అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ కార్యక్రమానికి అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్ సభాధ్యక్షత వహించగా, హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ అనంతరెడ్డి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. రైతులకు పంటల ఎంపిక, పంట మార్పిడి, నాణ్యమైన విత్తనాల వినియోగం, నేల ఆరోగ్య పరిరక్షణ, ఎరువుల సమతుల్య వినియోగం, ఆధునిక సాగు పద్ధతులపై నిపుణులు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మేయర్ బుర్ర చైతన్య శ్రీనివాస్ మాట్లాడుతూ, ఒకే పంటను పదేపదే సాగు చేయడం వల్ల నేల సారవంతత తగ్గిపోతుందని, పంట మార్పిడి విధానాన్ని అనుసరించడం ద్వారా భూమి ఆరోగ్యం మెరుగుపడి రైతులకు అధిక లాభాలు చేకూరుతాయని తెలిపారు. రైతులు మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు.

అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, ధృవీకరించిన విత్తనాల వినియోగం ద్వారా రైతులు మెరుగైన దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ అనంతరెడ్డి మాట్లాడుతూ ఉద్యాన పంటల సాగు రైతులకు అదనపు ఆదాయ మార్గంగా నిలుస్తుందని వివరించారు.

విత్తన మేళాలో వివిధ రకాల నాణ్యమైన విత్తనాలు, వ్యవసాయ సాంకేతిక పరికరాలు, పంటల సంరక్షణకు సంబంధించిన ప్రదర్శనలు ఏర్పాటు చేసి రైతులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ సంఘం అసిస్టెంట్ డైరెక్టర్ గిరి ప్రసాద్, హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ అనంతరెడ్డి, రెండవ డివిజన్ కార్పొరేటర్ పెరిక యాదయ్య, పి.ఎస్.ఎస్ చైర్మన్ నాగరత్నం రాజు, మూడవ డివిజన్ కార్పొరేటర్ పేర్ల మల్లేశ్వరి అశోక్ చంద్ర, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Sthanikam

రైతు సంరక్షణ కేంద్రంలో విత్తన మేళా పంటల సాగుపై అవగాహన సదస్సు

Article Image

నల్గొండ పట్టణ కేంద్రంలో

రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడులు సాధించాలని మేయర్ బుర్ర చైతన్య శ్రీనివాస్ అన్నారు. రైతు సంరక్షణ కేంద్రంలో నిర్వహించిన విత్తన మేళా – పంటల సాగుపై అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ కార్యక్రమానికి అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్ సభాధ్యక్షత వహించగా, హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ అనంతరెడ్డి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. రైతులకు పంటల ఎంపిక, పంట మార్పిడి, నాణ్యమైన విత్తనాల వినియోగం, నేల ఆరోగ్య పరిరక్షణ, ఎరువుల సమతుల్య వినియోగం, ఆధునిక సాగు పద్ధతులపై నిపుణులు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మేయర్ బుర్ర చైతన్య శ్రీనివాస్ మాట్లాడుతూ, ఒకే పంటను పదేపదే సాగు చేయడం వల్ల నేల సారవంతత తగ్గిపోతుందని, పంట మార్పిడి విధానాన్ని అనుసరించడం ద్వారా భూమి ఆరోగ్యం మెరుగుపడి రైతులకు అధిక లాభాలు చేకూరుతాయని తెలిపారు. రైతులు మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు.

అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, ధృవీకరించిన విత్తనాల వినియోగం ద్వారా రైతులు మెరుగైన దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ అనంతరెడ్డి మాట్లాడుతూ ఉద్యాన పంటల సాగు రైతులకు అదనపు ఆదాయ మార్గంగా నిలుస్తుందని వివరించారు.

విత్తన మేళాలో వివిధ రకాల నాణ్యమైన విత్తనాలు, వ్యవసాయ సాంకేతిక పరికరాలు, పంటల సంరక్షణకు సంబంధించిన ప్రదర్శనలు ఏర్పాటు చేసి రైతులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ సంఘం అసిస్టెంట్ డైరెక్టర్ గిరి ప్రసాద్, హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ అనంతరెడ్డి, రెండవ డివిజన్ కార్పొరేటర్ పెరిక యాదయ్య, పి.ఎస్.ఎస్ చైర్మన్ నాగరత్నం రాజు, మూడవ డివిజన్ కార్పొరేటర్ పేర్ల మల్లేశ్వరి అశోక్ చంద్ర, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News