శ్రీ చైతన్య స్కూల్ ముందు ఎస్ఎఫ్ఐ ధర్నా
శ్రీ చైతన్య స్కూల్ ముందు ఎస్ఎఫ్ఐ ధర్నా
Komidala Mahender reddy
అధిక ఫీజుల వసూళ్లు నిలిపివేయాలని డిమాండ్
నార్కట్పల్లి, జూన్ 24: ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం నార్కట్పల్లిలోని శ్రీ చైతన్య స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యను వ్యాపారంగా మార్చి ప్రతి ఏడాది ఫీజులను పెంచడాన్ని ఖండించారు.
ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాంలను బలవంతంగా కొనుగోలు చేయిస్తున్నారని ఆరోపిస్తూ, అధిక ఫీజుల వసూళ్లను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఫీజులు వసూలు చేయాలని, ఈ వ్యవహారంపై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నకిరేకల్ డివిజన్ నాయకులు ఆరూరి ప్రణీత్, ముస్కు రవీందర్తో పాటు సంజయ్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి