Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలి: సీఐ మన్మధ కుమార్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 04:12 PM

శ్రీ చైతన్య స్కూల్ ముందు ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా

శ్రీ చైతన్య స్కూల్ ముందు ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా

శ్రీ చైతన్య స్కూల్ ముందు ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా
June 24, 2026 02:45 PM 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


అధిక ఫీజుల వసూళ్లు నిలిపివేయాలని డిమాండ్


నార్కట్‌పల్లి, జూన్ 24: ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని ఆరోపిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం నార్కట్‌పల్లిలోని శ్రీ చైతన్య స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యను వ్యాపారంగా మార్చి ప్రతి ఏడాది ఫీజులను పెంచడాన్ని ఖండించారు.

ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాంలను బలవంతంగా కొనుగోలు చేయిస్తున్నారని ఆరోపిస్తూ, అధిక ఫీజుల వసూళ్లను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఫీజులు వసూలు చేయాలని, ఈ వ్యవహారంపై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ నాయకులు ఆరూరి ప్రణీత్, ముస్కు రవీందర్‌తో పాటు సంజయ్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News