Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:18 AM

శ్రీ చైతన్య స్కూల్ ముందు ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా

శ్రీ చైతన్య స్కూల్ ముందు ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా

శ్రీ చైతన్య స్కూల్ ముందు ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా
24-06-2026 210 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


అధిక ఫీజుల వసూళ్లు నిలిపివేయాలని డిమాండ్


నార్కట్‌పల్లి, జూన్ 24: ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని ఆరోపిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం నార్కట్‌పల్లిలోని శ్రీ చైతన్య స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యను వ్యాపారంగా మార్చి ప్రతి ఏడాది ఫీజులను పెంచడాన్ని ఖండించారు.

ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాంలను బలవంతంగా కొనుగోలు చేయిస్తున్నారని ఆరోపిస్తూ, అధిక ఫీజుల వసూళ్లను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఫీజులు వసూలు చేయాలని, ఈ వ్యవహారంపై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ నాయకులు ఆరూరి ప్రణీత్, ముస్కు రవీందర్‌తో పాటు సంజయ్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

శ్రీ చైతన్య స్కూల్ ముందు ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా

Article Image


అధిక ఫీజుల వసూళ్లు నిలిపివేయాలని డిమాండ్


నార్కట్‌పల్లి, జూన్ 24: ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని ఆరోపిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం నార్కట్‌పల్లిలోని శ్రీ చైతన్య స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించారు. విద్యను వ్యాపారంగా మార్చి ప్రతి ఏడాది ఫీజులను పెంచడాన్ని ఖండించారు.

ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫాంలను బలవంతంగా కొనుగోలు చేయిస్తున్నారని ఆరోపిస్తూ, అధిక ఫీజుల వసూళ్లను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఫీజులు వసూలు చేయాలని, ఈ వ్యవహారంపై విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నకిరేకల్ డివిజన్ నాయకులు ఆరూరి ప్రణీత్, ముస్కు రవీందర్‌తో పాటు సంజయ్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News