PRINT TIME: June 24, 2026 05:21 PM
డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలి: సీఐ మన్మధ కుమార్
డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలి: సీఐ మన్మధ కుమార్
June 24, 2026 03:52 PM
4 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
మాదకద్రవ్యాల మహమ్మారి వల్ల కలిగే నష్టాలపై అంగన్వాడీ టీచర్లు గ్రామస్థాయిలో ప్రజలకు, యువతకు అవగాహన కల్పించాలని చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందన్నారు. సమాజంలో ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అనంతరం అందరితో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలను అభినందించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఐసీడీఎస్ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి