Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:12 AM

డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలి: సీఐ మన్మధ కుమార్

డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలి: సీఐ మన్మధ కుమార్

డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలి: సీఐ మన్మధ కుమార్
24-06-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మాదకద్రవ్యాల మహమ్మారి వల్ల కలిగే నష్టాలపై అంగన్‌వాడీ టీచర్లు గ్రామస్థాయిలో ప్రజలకు, యువతకు అవగాహన కల్పించాలని చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందన్నారు. సమాజంలో ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అనంతరం అందరితో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లకు నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలను అభినందించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఐసీడీఎస్ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలి: సీఐ మన్మధ కుమార్

Article Image

మాదకద్రవ్యాల మహమ్మారి వల్ల కలిగే నష్టాలపై అంగన్‌వాడీ టీచర్లు గ్రామస్థాయిలో ప్రజలకు, యువతకు అవగాహన కల్పించాలని చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందన్నారు. సమాజంలో ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అనంతరం అందరితో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లకు నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలను అభినందించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఐసీడీఎస్ అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News