Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయం కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 06:22 PM

గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయం

గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయం

గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయం
June 24, 2026 04:49 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* రూ.15 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

* ఏఎంసీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, సర్పంచ్ జువ్వి నర్సింహ్మ

​గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, సర్పంచ్ జువ్వి నర్సింహ్మ అన్నారు. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామంలో ఉపాధి హామీ (ఎన్ఆర్ఇజిఎస్) నిధులు రూ.15 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం వారు ఘనంగా శంకుస్థాపన చేశారు.​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రాధాన్యత క్రమంలో అంచెలంచెలుగా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని స్పష్టం చేశారు.​అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తూ, సంక్షేమ ఫలాలు అందజేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే సొంతం. ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందజేస్తూ ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది.​ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, దశాబ్ద కాలంగా ఆగిపోయిన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందజేయడంతో పాటు నిర్విరామంగా రేషన్ కార్డుల ప్రక్రియ చేపట్టడం కాంగ్రెస్ పార్టీ నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనమని వారు పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ వంటి పథకాలు విజయవంతంగా అందుతున్నాయని వివరించారు.​ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పకీరు శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు ఊదరి శ్రీనివాస్, సామిడి సంధ్య, ఐతరాజు శారద లింగస్వామి, రాచకొండ భార్గవ్, జీడిముడ్ల శోభ, గునుగంటి వెంకటేశం, జంగం వెంకటమ్మ, మాజీ ఉప సర్పంచ్‌లు బత్తుల శ్రీహరి, కొంతం బుచ్చిరెడ్డి, బద్రి లింగయ్య, ఐతరాజు సత్తయ్య, రాచకొండ కృష్ణయ్య, సామిడి లింగారెడ్డి, ఊదరి లింగయ్య, రాచకొండ వెంకటేశం, ఊదరి స్వామి, గునుగంటి స్వామి, చెన్నోజు భూషణాచారి, బోనకుర్తి హరికృష్ణ, ఊదరి రవి, జంగం అంజయ్య, ఐతరాజు రవీందర్, బత్తుల సింహాచలం, కొంతం శ్రీనివాస్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు, కాలనీ వాసులు‌, గ్రామస్తులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News