Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయం కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 05:25 PM

ఆలయ మార్గంపై మట్టి పోసి ఆక్రమణ? నిదానపల్లిలో భక్తుల ఆందోళన.

ఆలయ మార్గంపై మట్టి పోసి ఆక్రమణ? నిదానపల్లిలో భక్తుల ఆందోళన.

ఆలయ మార్గంపై మట్టి పోసి ఆక్రమణ?  నిదానపల్లిలో భక్తుల ఆందోళన.
June 24, 2026 04:06 PM 119 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భవిష్యత్తులో రోడ్డు విస్తరణకు అడ్డంకులు ఏర్పడే అవకాశం.

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లే బీటీ రహదారిపై ఆక్రమణల ముప్పు నెలకొంది. రహదారికి ఆనుకుని ఉన్న వ్యవసాయ భూమి యజమానులు పొలం మట్టిని భారీగా పోయడంతో రోడ్డు హద్దులు క్రమంగా కుదించుకుపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఆలయానికి వెళ్లే ప్రధాన మార్గంలోనే మట్టిని రోడ్డు అంచుల వరకు పోయడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షాకాలంలో మట్టి రోడ్డుపైకి జారి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిదానపల్లి గుట్టపై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు భావిస్తున్న తరుణంలో రహదారి విస్తరణ అవసరం ఏర్పడే అవకాశముంది. అయితే ప్రస్తుతం రోడ్డు హద్దుల వరకు మట్టిని పోయడం వల్ల భవిష్యత్తులో రోడ్డు వెడల్పు పనులకు ఆటంకం కలిగే పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు చెబుతున్నారు.

ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు స్పందించి రహదారి హద్దులను పరిశీలించి, రోడ్డు భూమిపై ఉన్న మట్టిని తొలగించి ప్రజా ప్రయోజనాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News