Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:46 AM

ఆలయ మార్గంపై మట్టి పోసి ఆక్రమణ? నిదానపల్లిలో భక్తుల ఆందోళన.

ఆలయ మార్గంపై మట్టి పోసి ఆక్రమణ? నిదానపల్లిలో భక్తుల ఆందోళన.

ఆలయ మార్గంపై మట్టి పోసి ఆక్రమణ?  నిదానపల్లిలో భక్తుల ఆందోళన.
24-06-2026 287 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భవిష్యత్తులో రోడ్డు విస్తరణకు అడ్డంకులు ఏర్పడే అవకాశం.

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లే బీటీ రహదారిపై ఆక్రమణల ముప్పు నెలకొంది. రహదారికి ఆనుకుని ఉన్న వ్యవసాయ భూమి యజమానులు పొలం మట్టిని భారీగా పోయడంతో రోడ్డు హద్దులు క్రమంగా కుదించుకుపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఆలయానికి వెళ్లే ప్రధాన మార్గంలోనే మట్టిని రోడ్డు అంచుల వరకు పోయడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షాకాలంలో మట్టి రోడ్డుపైకి జారి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిదానపల్లి గుట్టపై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు భావిస్తున్న తరుణంలో రహదారి విస్తరణ అవసరం ఏర్పడే అవకాశముంది. అయితే ప్రస్తుతం రోడ్డు హద్దుల వరకు మట్టిని పోయడం వల్ల భవిష్యత్తులో రోడ్డు వెడల్పు పనులకు ఆటంకం కలిగే పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు చెబుతున్నారు.

ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు స్పందించి రహదారి హద్దులను పరిశీలించి, రోడ్డు భూమిపై ఉన్న మట్టిని తొలగించి ప్రజా ప్రయోజనాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Sthanikam

ఆలయ మార్గంపై మట్టి పోసి ఆక్రమణ? నిదానపల్లిలో భక్తుల ఆందోళన.

Article Image

భవిష్యత్తులో రోడ్డు విస్తరణకు అడ్డంకులు ఏర్పడే అవకాశం.

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లే బీటీ రహదారిపై ఆక్రమణల ముప్పు నెలకొంది. రహదారికి ఆనుకుని ఉన్న వ్యవసాయ భూమి యజమానులు పొలం మట్టిని భారీగా పోయడంతో రోడ్డు హద్దులు క్రమంగా కుదించుకుపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఆలయానికి వెళ్లే ప్రధాన మార్గంలోనే మట్టిని రోడ్డు అంచుల వరకు పోయడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వర్షాకాలంలో మట్టి రోడ్డుపైకి జారి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిదానపల్లి గుట్టపై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు భావిస్తున్న తరుణంలో రహదారి విస్తరణ అవసరం ఏర్పడే అవకాశముంది. అయితే ప్రస్తుతం రోడ్డు హద్దుల వరకు మట్టిని పోయడం వల్ల భవిష్యత్తులో రోడ్డు వెడల్పు పనులకు ఆటంకం కలిగే పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు చెబుతున్నారు.

ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు స్పందించి రహదారి హద్దులను పరిశీలించి, రోడ్డు భూమిపై ఉన్న మట్టిని తొలగించి ప్రజా ప్రయోజనాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News