Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:36 AM

చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి.. లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టండి: ఎస్సై విద్యచరణ్ రెడ్డి

చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి.. లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టండి: ఎస్సై విద్యచరణ్ రెడ్డి

చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి.. లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టండి: ఎస్సై విద్యచరణ్ రెడ్డి
24-06-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంజీరా జూనియర్ కళాశాలలో పటాన్చెరు పోలీసుల ఆధ్వర్యంలో “డ్రగ్స్ వద్దు – జీవితానికి అవును” అనే అంశంపై మెగా అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై విద్యచరణ్ రెడ్డి మాట్లాడుతూ...విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, కుటుంబాలు మరియు సమాజంపై పడే దుష్ప్రభావాల గురించి వివరించారు. డ్రగ్స్ అలవాటు యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, విద్యార్థి దశలోనే చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు మరియు మంచి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం డ్రగ్స్ సేవించడం, విక్రయించడం లేదా రవాణా చేయడం వంటి చర్యలకు కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ఎక్కడైనా డ్రగ్స్ విక్రయాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే డయల్-100 లేదా 1908 నంబర్లకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు మరియు సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో పటాన్చెరు పోలీసులు విద్యార్థులతో "డ్రగ్స్‌కు దూరంగా ఉంటాం.. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతాం" అంటూ ప్రతిజ్ఞ చేయించి, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్సై విద్యచరణ్ రెడ్డి పిలుపునిచ్చారు.

Sthanikam

చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి.. లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టండి: ఎస్సై విద్యచరణ్ రెడ్డి

Article Image

పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంజీరా జూనియర్ కళాశాలలో పటాన్చెరు పోలీసుల ఆధ్వర్యంలో “డ్రగ్స్ వద్దు – జీవితానికి అవును” అనే అంశంపై మెగా అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై విద్యచరణ్ రెడ్డి మాట్లాడుతూ...విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, కుటుంబాలు మరియు సమాజంపై పడే దుష్ప్రభావాల గురించి వివరించారు. డ్రగ్స్ అలవాటు యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, విద్యార్థి దశలోనే చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు మరియు మంచి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం డ్రగ్స్ సేవించడం, విక్రయించడం లేదా రవాణా చేయడం వంటి చర్యలకు కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. ఎక్కడైనా డ్రగ్స్ విక్రయాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే డయల్-100 లేదా 1908 నంబర్లకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు మరియు సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో పటాన్చెరు పోలీసులు విద్యార్థులతో "డ్రగ్స్‌కు దూరంగా ఉంటాం.. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతాం" అంటూ ప్రతిజ్ఞ చేయించి, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్సై విద్యచరణ్ రెడ్డి పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News