Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:35 AM

డిజిటల్ విద్యాభివృద్ధికి చేయూత.. ఖేడ్ జడ్పీహెచ్ఎస్‌కు 10 ల్యాప్‌టాప్‌లు అందజేత

డిజిటల్ విద్యాభివృద్ధికి చేయూత.. ఖేడ్ జడ్పీహెచ్ఎస్‌కు 10 ల్యాప్‌టాప్‌లు అందజేత

డిజిటల్ విద్యాభివృద్ధికి చేయూత.. ఖేడ్ జడ్పీహెచ్ఎస్‌కు 10 ల్యాప్‌టాప్‌లు అందజేత
24-06-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna


ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌కు చెందిన అంనెట్ డిజిటల్ సాఫ్ట్‌వేర్ సంస్థ నారాయణఖేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.5 లక్షల విలువైన 10 ల్యాప్‌టాప్‌లను అందజేసింది. సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ ల్యాప్‌టాప్‌లను ప్రధానోపాధ్యాయుడు మన్మధ కిషోర్, ఉపాధ్యాయులు రాజశేఖర్, చంద్రశేఖర్ ఆచార్యలకు అందించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ సుమారు 900 మంది విద్యార్థులు చదువుతున్న ఖేడ్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు. లయన్స్ క్లబ్ సభ్యుడు చంద్రశేఖర్ ఆచార్య విజ్ఞప్తి మేరకు ఈ సహాయం అందించామని, విద్యార్థులు ల్యాప్‌టాప్‌లను సద్వినియోగం చేసుకుని సాంకేతిక విద్యలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అంనెట్ డిజిటల్ సంస్థ సీఈవో కృష్ణారెడ్డి, సీనియర్ డైరెక్టర్ వల్లి సూర్యదేవర, హర్షిత్ సక్సేనా, అభిలాష్, మల్లేశ్వరి, లయన్స్ క్లబ్ సభ్యులు నాగరాజు, అరుణ, మాధవి సూర్యతో పాటు పలువురు పాల్గొన్నారు.

Sthanikam

డిజిటల్ విద్యాభివృద్ధికి చేయూత.. ఖేడ్ జడ్పీహెచ్ఎస్‌కు 10 ల్యాప్‌టాప్‌లు అందజేత

Article Image


ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌కు చెందిన అంనెట్ డిజిటల్ సాఫ్ట్‌వేర్ సంస్థ నారాయణఖేడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.5 లక్షల విలువైన 10 ల్యాప్‌టాప్‌లను అందజేసింది. సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ ల్యాప్‌టాప్‌లను ప్రధానోపాధ్యాయుడు మన్మధ కిషోర్, ఉపాధ్యాయులు రాజశేఖర్, చంద్రశేఖర్ ఆచార్యలకు అందించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ సుమారు 900 మంది విద్యార్థులు చదువుతున్న ఖేడ్ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు. లయన్స్ క్లబ్ సభ్యుడు చంద్రశేఖర్ ఆచార్య విజ్ఞప్తి మేరకు ఈ సహాయం అందించామని, విద్యార్థులు ల్యాప్‌టాప్‌లను సద్వినియోగం చేసుకుని సాంకేతిక విద్యలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అంనెట్ డిజిటల్ సంస్థ సీఈవో కృష్ణారెడ్డి, సీనియర్ డైరెక్టర్ వల్లి సూర్యదేవర, హర్షిత్ సక్సేనా, అభిలాష్, మల్లేశ్వరి, లయన్స్ క్లబ్ సభ్యులు నాగరాజు, అరుణ, మాధవి సూర్యతో పాటు పలువురు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News