Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:34 AM

వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేయాలి.. అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి

వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేయాలి.. అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి

వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేయాలి.. అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి
24-06-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నగల్‌గిద్ద మండలం ముక్తాపూర్ గ్రామ పరిధిలో గల రాంసింగ్ తండాలో నూతనంగా నిర్మిస్తున్న బీటీ రహదారి పనులను ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి నిర్మాణ పనుల నాణ్యత, పురోగతిని పరిశీలించి సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనుల్లో ఎలాంటి నాణ్యతా లోపాలు ఉండకూడదని, నిబంధనల ప్రకారం పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విఠల్‌రావు పాటిల్, సంజీవ్ పాటిల్, రమేష్ చౌహాన్, పండరి రెడ్డి, అంజిరెడ్డి, శ్రీకాంత్ స్వామి, స్వామిదాస్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, తండా వాసులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేయాలి.. అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నగల్‌గిద్ద మండలం ముక్తాపూర్ గ్రామ పరిధిలో గల రాంసింగ్ తండాలో నూతనంగా నిర్మిస్తున్న బీటీ రహదారి పనులను ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి నిర్మాణ పనుల నాణ్యత, పురోగతిని పరిశీలించి సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనుల్లో ఎలాంటి నాణ్యతా లోపాలు ఉండకూడదని, నిబంధనల ప్రకారం పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విఠల్‌రావు పాటిల్, సంజీవ్ పాటిల్, రమేష్ చౌహాన్, పండరి రెడ్డి, అంజిరెడ్డి, శ్రీకాంత్ స్వామి, స్వామిదాస్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, తండా వాసులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News