వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేయాలి.. అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి
వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేయాలి.. అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నగల్గిద్ద మండలం ముక్తాపూర్ గ్రామ పరిధిలో గల రాంసింగ్ తండాలో నూతనంగా నిర్మిస్తున్న బీటీ రహదారి పనులను ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి నిర్మాణ పనుల నాణ్యత, పురోగతిని పరిశీలించి సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్కు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనుల్లో ఎలాంటి నాణ్యతా లోపాలు ఉండకూడదని, నిబంధనల ప్రకారం పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విఠల్రావు పాటిల్, సంజీవ్ పాటిల్, రమేష్ చౌహాన్, పండరి రెడ్డి, అంజిరెడ్డి, శ్రీకాంత్ స్వామి, స్వామిదాస్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, తండా వాసులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి