Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:21 AM

ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మున్సిపల్ యంత్రాంగం

ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మున్సిపల్ యంత్రాంగం

ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మున్సిపల్ యంత్రాంగం
24-06-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ, 2వ వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ మాచునూరి లక్ష్మీ రాజు యాదవ్, 1వ వార్డు కౌన్సిలర్ నర్సమ్మ (రవి), 2వ వార్డు కౌన్సిలర్ సుధీర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిబ్బంది కలిసి పర్యటించి స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, పారిశుధ్యం, మురుగు కాలువలు, వీధి దీపాలు, రహదారులు తదితర సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి ప్రజలకు వివరించి, అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రతి వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మున్సిపల్ యంత్రాంగం

Article Image

నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ, 2వ వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ మాచునూరి లక్ష్మీ రాజు యాదవ్, 1వ వార్డు కౌన్సిలర్ నర్సమ్మ (రవి), 2వ వార్డు కౌన్సిలర్ సుధీర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిబ్బంది కలిసి పర్యటించి స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, పారిశుధ్యం, మురుగు కాలువలు, వీధి దీపాలు, రహదారులు తదితర సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి ప్రజలకు వివరించి, అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రతి వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News