ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మున్సిపల్ యంత్రాంగం
ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మున్సిపల్ యంత్రాంగం
Krishna
నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ, 2వ వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ మాచునూరి లక్ష్మీ రాజు యాదవ్, 1వ వార్డు కౌన్సిలర్ నర్సమ్మ (రవి), 2వ వార్డు కౌన్సిలర్ సుధీర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిబ్బంది కలిసి పర్యటించి స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, పారిశుధ్యం, మురుగు కాలువలు, వీధి దీపాలు, రహదారులు తదితర సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి ప్రజలకు వివరించి, అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, ప్రతి వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి