Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:10 AM

ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్!

ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్!

ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్!
24-06-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్

కార్పొరేట్ విద్యాసంస్థలకు విద్యాశాఖ అధికారులు తొత్తులుగా మారారు: ఏబీవీపీ నాయకుడు బాతరాజు కార్తీక్

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బందుకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర శాఖ పిలుపునిచ్చిన నేపథ్యంలో.. చౌటుప్పల్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. చౌటుప్పల్ పట్టణ, మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు యాజమాన్యాలు స్వచ్ఛందంగా విద్యాసంస్థలను మూసివేసి బంద్‌కు మద్దతు ప్రకటించాయి.ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు బతరాజు కార్తీక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 12,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే దిశగా కుట్రపూరిత ప్రణాళికలు రచిస్తోందని మండిపడ్డారు. విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ విద్యాసంస్థలకు తొత్తులుగా మారారని ధ్వజమెత్తారు.

​"రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ప్రకారం పేద విద్యార్థులకు అందించాల్సిన 25 శాతం ఉచిత విద్యను అందించకుండా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధికారులను మేనేజ్ చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్లలోనే బుక్స్, యూనిఫారాలు విక్రయిస్తూ పేద తల్లిదండ్రుల రక్తాన్ని పిండుతున్నారు. ప్రైవేట్ విద్యా మాఫియాగా తయారవుతున్న ఈ సంస్థలకు విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు పలుకుతున్నారా? దీనికి వారు సమాధానం చెప్పాలి."

​ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోకపోతే, రానున్న రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

​ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు దూసరి శివ సాయి, పల్చం రిత్విక్, అభి, కొత్త సాయి, నందగిరి ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్!

Article Image

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్

కార్పొరేట్ విద్యాసంస్థలకు విద్యాశాఖ అధికారులు తొత్తులుగా మారారు: ఏబీవీపీ నాయకుడు బాతరాజు కార్తీక్

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బందుకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర శాఖ పిలుపునిచ్చిన నేపథ్యంలో.. చౌటుప్పల్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. చౌటుప్పల్ పట్టణ, మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు యాజమాన్యాలు స్వచ్ఛందంగా విద్యాసంస్థలను మూసివేసి బంద్‌కు మద్దతు ప్రకటించాయి.ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు బతరాజు కార్తీక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 12,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే దిశగా కుట్రపూరిత ప్రణాళికలు రచిస్తోందని మండిపడ్డారు. విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ విద్యాసంస్థలకు తొత్తులుగా మారారని ధ్వజమెత్తారు.

​"రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ప్రకారం పేద విద్యార్థులకు అందించాల్సిన 25 శాతం ఉచిత విద్యను అందించకుండా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అధికారులను మేనేజ్ చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్లలోనే బుక్స్, యూనిఫారాలు విక్రయిస్తూ పేద తల్లిదండ్రుల రక్తాన్ని పిండుతున్నారు. ప్రైవేట్ విద్యా మాఫియాగా తయారవుతున్న ఈ సంస్థలకు విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు పలుకుతున్నారా? దీనికి వారు సమాధానం చెప్పాలి."

​ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోకపోతే, రానున్న రోజుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

​ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు దూసరి శివ సాయి, పల్చం రిత్విక్, అభి, కొత్త సాయి, నందగిరి ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News