పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి
పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి
Editor Desk
భువనగిరి, : భువనగిరి పట్టణ శివారులోని 700 సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిని చదును చేసి ప్లాట్లు రూపొందించి పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీపీఎం పోరాటాల ఫలితంగా అధికారులు ఇటీవల సర్వే నిర్వహించి 20 ఎకరాలు సీలింగ్ భూమి, 18 ఎకరాలు పట్టా భూమి కలిపి మొత్తం 38 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. భూమిని అభివృద్ధి చేసి పేదలకు పంపిణీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేక పేదలు అద్దె భారం మోయలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. 700 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిని వెంటనే చదును చేసి ప్లాట్లు కేటాయించాలని, లేనిపక్షంలో గుడిసెవాసుల భూపోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, నాయకులు కొత్త లక్ష్మయ్య, దొడ్డి శంకర్, పిట్టల చంద్రశేఖర్, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి