Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 06:42 AM

పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి

పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి

పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి
24-06-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, : భువనగిరి పట్టణ శివారులోని 700 సర్వే నంబర్‌లో ఉన్న ప్రభుత్వ భూమిని చదును చేసి ప్లాట్లు రూపొందించి పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీపీఎం పోరాటాల ఫలితంగా అధికారులు ఇటీవల సర్వే నిర్వహించి 20 ఎకరాలు సీలింగ్ భూమి, 18 ఎకరాలు పట్టా భూమి కలిపి మొత్తం 38 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. భూమిని అభివృద్ధి చేసి పేదలకు పంపిణీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేక పేదలు అద్దె భారం మోయలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. 700 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూమిని వెంటనే చదును చేసి ప్లాట్లు కేటాయించాలని, లేనిపక్షంలో గుడిసెవాసుల భూపోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, నాయకులు కొత్త లక్ష్మయ్య, దొడ్డి శంకర్, పిట్టల చంద్రశేఖర్, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి

Article Image

భువనగిరి, : భువనగిరి పట్టణ శివారులోని 700 సర్వే నంబర్‌లో ఉన్న ప్రభుత్వ భూమిని చదును చేసి ప్లాట్లు రూపొందించి పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీపీఎం పోరాటాల ఫలితంగా అధికారులు ఇటీవల సర్వే నిర్వహించి 20 ఎకరాలు సీలింగ్ భూమి, 18 ఎకరాలు పట్టా భూమి కలిపి మొత్తం 38 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. భూమిని అభివృద్ధి చేసి పేదలకు పంపిణీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేక పేదలు అద్దె భారం మోయలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. 700 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ భూమిని వెంటనే చదును చేసి ప్లాట్లు కేటాయించాలని, లేనిపక్షంలో గుడిసెవాసుల భూపోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ, నాయకులు కొత్త లక్ష్మయ్య, దొడ్డి శంకర్, పిట్టల చంద్రశేఖర్, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News