ఆర్టీసీ బస్సు పునరుద్ధరించాలి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
ఆర్టీసీ బస్సు పునరుద్ధరించాలి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాస్తారోకో. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Editor Desk
రామన్నపేట: రామన్నపేట–అమ్మనబోలు రూట్లో ఆర్టీసీ బస్సును తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. దీంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలుగా ఈ రూట్లో ఆర్టీసీ బస్సు సేవలు నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రామన్నపేట–అమ్మనబోలు రూట్ పరిధిలోని తొమ్మిది గ్రామాలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు వివిధ విద్యాసంస్థల్లో చదువుకుంటున్నప్పటికీ, మండల కేంద్రానికి సరైన రవాణా సౌకర్యం లేక విద్యాభ్యాసానికి ఆటంకాలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.
సమస్య పరిష్కారం కోసం పలుమార్లు ఆర్టీసీ, ప్రభుత్వ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోయిందన్నారు. ప్రతిరోజూ ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి రావడంతో ఒక్కో విద్యార్థి రోజుకు సుమారు రూ.100 వరకు అదనపు ఖర్చు భరించాల్సి వస్తోందని, ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వెంటనే ఆర్టీసీ బస్సు సేవలను పునరుద్ధరించాలని, లేకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యురాలు పెద్ది అక్షిత, మండల నాయకులు పిట్టల నవీన్, అప్పం అభిరూప్, బూడిద యశ్వంత్, ముక్కిడి ప్రవీణ్, తుర్కపల్లి లోకేష్, అభినవ్, శ్రావ్య, అనుప్రియ, హారిక తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి