Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'చలో హైదరాబాద్‌'ను విజయవంతం చేయండి: సుర్కంటి శ్రీధర్ రెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 09:48 PM

ప్రతి కుటుంబానికీ బీమా రక్షణ అవసరం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

ప్రతి కుటుంబానికీ బీమా రక్షణ అవసరం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

ప్రతి కుటుంబానికీ బీమా రక్షణ అవసరం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
June 24, 2026 07:47 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* చౌటుప్పల్‌లో 'టాటా ఏఐఏ' ఇన్సూరెన్స్ కార్యాలయం ప్రారంభం

ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థిక భద్రత చేకూరాలంటే బీమా సౌకర్యం ఎంతో అవసరమని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'టాటా ఏఐఏ ఇన్సూరెన్స్' కార్యాలయాన్ని బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు కుటుంబ యజమాని మరణిస్తే ఆ ఇల్లు రోడ్డున పడకుండా, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇన్సూరెన్స్ ఎంతో దోహదపడుతుందని, కుటుంబాలను కాపాడుతుందని తెలిపారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ బీమా ప్రాధాన్యతను గుర్తించాలన్నారు.​ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ పావని రమేష్ గౌడ్, 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్, కౌన్సిలర్ ఊడుగు జ్యోతి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పబ్బు రాజు గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, సంస్థ ప్రతినిధులు, సీనియర్ బిజినెస్ అసోసియేట్ కొండ వెంకటరమణారెడ్డి, ఫణి కుమార్, దిల్షుక్‌నగర్ బ్రాంచ్ మేనేజర్ శ్యామ్ రావు, ట్రైనింగ్ ఆఫీసర్ శర్మ, ఏబీఎఎం మురళి, శ్రీధర్, శివం సింగ్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News