ప్రతి కుటుంబానికీ బీమా రక్షణ అవసరం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
ప్రతి కుటుంబానికీ బీమా రక్షణ అవసరం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
K.RAVI
* చౌటుప్పల్లో 'టాటా ఏఐఏ' ఇన్సూరెన్స్ కార్యాలయం ప్రారంభం
ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థిక భద్రత చేకూరాలంటే బీమా సౌకర్యం ఎంతో అవసరమని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'టాటా ఏఐఏ ఇన్సూరెన్స్' కార్యాలయాన్ని బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు కుటుంబ యజమాని మరణిస్తే ఆ ఇల్లు రోడ్డున పడకుండా, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇన్సూరెన్స్ ఎంతో దోహదపడుతుందని, కుటుంబాలను కాపాడుతుందని తెలిపారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రతి ఒక్కరూ బీమా ప్రాధాన్యతను గుర్తించాలన్నారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ పావని రమేష్ గౌడ్, 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్, కౌన్సిలర్ ఊడుగు జ్యోతి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పబ్బు రాజు గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, సంస్థ ప్రతినిధులు, సీనియర్ బిజినెస్ అసోసియేట్ కొండ వెంకటరమణారెడ్డి, ఫణి కుమార్, దిల్షుక్నగర్ బ్రాంచ్ మేనేజర్ శ్యామ్ రావు, ట్రైనింగ్ ఆఫీసర్ శర్మ, ఏబీఎఎం మురళి, శ్రీధర్, శివం సింగ్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి