PRINT TIME: June 25, 2026 03:30 PM
ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావాలి – డ్రగ్స్కు దూరంగా ఉండాలి
ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావాలి – డ్రగ్స్కు దూరంగా ఉండాలి
June 25, 2026 02:01 PM
13 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డిలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన 2కె రన్ను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని, అదే సమయంలో మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఓటరు జాబితాల సవరణలో ప్రజలు పూర్తి సహకారం అందించాలని, డ్రగ్స్ నిర్మూలనలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత, పోలీసు సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి