Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేణుక ఎల్లమ్మ సన్నిధిలో బాలుడి అన్నప్రాశన. డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 07:05 PM

సమస్యల వలయాల్లో సరస్వతి నిలయాలు. భువనగిరి కేజీబీవీలో నీటి కష్టాలు

సమస్యల వలయాల్లో సరస్వతి నిలయాలు. భువనగిరి కేజీబీవీలో నీటి కష్టాలు

సమస్యల వలయాల్లో సరస్వతి నిలయాలు.  భువనగిరి కేజీబీవీలో నీటి కష్టాలు
June 25, 2026 05:04 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అధికారుల సందర్శనలే తప్ప.. పరిష్కారం శూన్యం

భువనగిరి: జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో తాగు, వినియోగ నీటి సమస్య విద్యార్థినులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. సుమారు 300 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్న ఈ విద్యాలయంలో నీటి సరఫరాకు శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమయ్యారని తల్లిదండ్రులు, బాలల హక్కుల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.


గతంలో నీటి కొరత తీవ్రంగా ఉండటంతో అప్పటి ఆర్డీవో భూపాల్‌రెడ్డి ప్రభుత్వ నిధులతో బోరు వేయించినప్పటికీ, అది వర్షాకాలంలో మాత్రమే అవసరాలను తీర్చగలుగుతోందని చెబుతున్నారు. ఎండాకాలం ప్రారంభమైతే మళ్లీ నీటి సమస్య తలెత్తుతోందని వాపోతున్నారు.


పాఠశాలలు ప్రారంభమై వారం రోజులు గడిచినా, వర్షాలు లేకపోవడం, ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో నీటి కొరత మరింత తీవ్రమైందని తెలుస్తోంది. స్నానాలు, ఇతర అవసరాలకు తగినంత నీరు అందక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. కొందరు విద్యార్థినులు ఆరోగ్య సమస్యల కారణంగా సెలవులు పెట్టుకుని ఇళ్లకు వెళ్తున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.


ఇందిరమ్మ కాలనీతో పాటు కేజీబీవీకి ప్రత్యేకంగా ట్యాంకర్లను కేటాయించినప్పటికీ, నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు పలువురు పాఠశాలను సందర్శించినా సమస్య మాత్రం యథాతథంగానే ఉందని స్థానికులు అంటున్నారు.


ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థినులకు తగిన నీటి వసతి కల్పించాలని, శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని బాలికలు, తల్లిదండ్రులు, బాలల హక్కుల సంఘం నాయకులు కోరుతున్నారు.



మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News