అక్రమ పాఠశాలలపై ఉక్కుపాదం మోపాలి. గుర్తింపు లేని విద్యాసంస్థలను మూసివేయాలి
అక్రమ పాఠశాలలపై ఉక్కుపాదం మోపాలి. గుర్తింపు లేని విద్యాసంస్థలను మూసివేయాలి
Editor Desk
గుర్రంపోడు మండల కేంద్రంలో ఉన్న లిటిల్ ఛాంపియన్ స్కూల్కు ఏడవ తరగతి వరకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, పదో తరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిసిందని, ఈ వ్యవహారంపై విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడి) గారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ అనుమతి లేని తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. విద్యాశాఖ అధికారులు వెంటనే పాఠశాలపై తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెలికితీయాలని, నిబంధనలను ఉల్లంఘించినట్లయితే సంబంధిత యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు మోసపోకుండా విద్యాశాఖ పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి