Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తిమ్మాపూర్‌లో ఓటరు నమోదు ప్రక్రియను తనిఖీ చేసిన:సబ్ కలెక్టర్ ఉమాహారతి కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 05:54 PM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్
June 25, 2026 03:57 PM 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు మొక్కల నాటేందుకు అవసరమైన గుంతల తవ్వకాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఆరా తీసి పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో ఎంపీడీఓ రాములు, ఏపీవో వెంకన్న, హౌసింగ్ ఏఈ సురేష్, టెక్నికల్ అసిస్టెంట్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News