PRINT TIME: June 25, 2026 05:54 PM
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్
June 25, 2026 03:57 PM
39 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు మొక్కల నాటేందుకు అవసరమైన గుంతల తవ్వకాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఆరా తీసి పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో ఎంపీడీఓ రాములు, ఏపీవో వెంకన్న, హౌసింగ్ ఏఈ సురేష్, టెక్నికల్ అసిస్టెంట్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి