Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:52 AM

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం
25-06-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్, మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తును కూడా దెబ్బతీస్తుందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్‌బాబు అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు–1, 2 ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డా. సురేష్‌బాబు మాట్లాడుతూ విద్య, క్రమశిక్షణ, సంకల్పబలంతోనే మాదకద్రవ్యాల వ్యసనాన్ని జయించవచ్చని అన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ కె. వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మాదకద్రవ్యాలు తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే ఇస్తాయని, కానీ ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, కుటుంబ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. మాదకద్రవ్యాలను కలిగి ఉండటం కూడా చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని తెలిపారు. విద్యార్థులు చదువు, క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు.

మాదకద్రవ్యాల బారిన పడిన వారు సహాయం కోరితే పోలీసులు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. కార్యక్రమాన్ని ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాధికారులు డా. ఇ. యాదగిరి రెడ్డి, డా. ఎస్. శారదాదేవి సమన్వయం చేశారు.

కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డా. డి. శ్రీపతి నాయుడు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం

Article Image

హయత్‌నగర్, మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తును కూడా దెబ్బతీస్తుందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్‌బాబు అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు–1, 2 ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డా. సురేష్‌బాబు మాట్లాడుతూ విద్య, క్రమశిక్షణ, సంకల్పబలంతోనే మాదకద్రవ్యాల వ్యసనాన్ని జయించవచ్చని అన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ కె. వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మాదకద్రవ్యాలు తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే ఇస్తాయని, కానీ ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, కుటుంబ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. మాదకద్రవ్యాలను కలిగి ఉండటం కూడా చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని తెలిపారు. విద్యార్థులు చదువు, క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు.

మాదకద్రవ్యాల బారిన పడిన వారు సహాయం కోరితే పోలీసులు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. కార్యక్రమాన్ని ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాధికారులు డా. ఇ. యాదగిరి రెడ్డి, డా. ఎస్. శారదాదేవి సమన్వయం చేశారు.

కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డా. డి. శ్రీపతి నాయుడు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News