Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:07 AM

​​లో-వోల్టేజ్ ‘చీకట్లు’ తీరాయి!

​​లో-వోల్టేజ్ ‘చీకట్లు’ తీరాయి!

​​లో-వోల్టేజ్ ‘చీకట్లు’ తీరాయి!
25-06-2026 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* 17వ వార్డులో 160 హెచ్‌పీ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు

* ఎమ్మెల్యే, చైర్మన్ సహకారంతో సమస్యకు మోక్షం: కౌన్సిలర్ ఉమామహేశ్వరి

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో దీర్ఘకాలంగా వేధిస్తున్న లో-వోల్టేజ్ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. వార్డులోని విద్యుత్ సమస్యలపై స్థానిక కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి-సాయిలు ట్రాన్స్‌కో ఏఈ కి ఫిర్యాదు చేయడంతో అధికారులు తక్షణమే స్పందించారు. గతంలో ఉన్న 100 హెచ్‌పీ ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి, దాని స్థానంలో నూతనంగా 160 హెచ్‌పీ సామర్థ్యం గల భారీ ట్రాన్స్‌ఫార్మర్‌ను గురువారం ఏర్పాటు చేశారు.​ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి-సాయిలు మాట్లాడుతూ.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి సహకారం, మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని-రమేష్ గౌడ్ సూచనలతోనే ఈ సమస్య పరిష్కారమైందని తెలిపారు. తమ వార్డు ప్రజల ఇబ్బందులను గుర్తించి త్వరితగతిన కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేసిన ట్రాన్స్‌కో ఏఈకి, సిబ్బందికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.వార్డులో ఉన్న అన్ని ప్రజా సమస్యలను అంచెలంచెలుగా పరిష్కరించి ప్రజల మన్ననలు పొందుతాం. 17వ వార్డు పరిధిలో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా మా దృష్టికి తీసుకురావచ్చు. వాటిని తప్పకుండా పరిష్కరిస్తాం. అని కౌన్సిలర్ హామీ ఇచ్చారు.​ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మాదాని గోపాల్, సైదులు, ట్రాన్స్‌కో సిబ్బంది, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

​​లో-వోల్టేజ్ ‘చీకట్లు’ తీరాయి!

Article Image

​* 17వ వార్డులో 160 హెచ్‌పీ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు

* ఎమ్మెల్యే, చైర్మన్ సహకారంతో సమస్యకు మోక్షం: కౌన్సిలర్ ఉమామహేశ్వరి

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో దీర్ఘకాలంగా వేధిస్తున్న లో-వోల్టేజ్ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. వార్డులోని విద్యుత్ సమస్యలపై స్థానిక కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి-సాయిలు ట్రాన్స్‌కో ఏఈ కి ఫిర్యాదు చేయడంతో అధికారులు తక్షణమే స్పందించారు. గతంలో ఉన్న 100 హెచ్‌పీ ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి, దాని స్థానంలో నూతనంగా 160 హెచ్‌పీ సామర్థ్యం గల భారీ ట్రాన్స్‌ఫార్మర్‌ను గురువారం ఏర్పాటు చేశారు.​ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి-సాయిలు మాట్లాడుతూ.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి సహకారం, మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని-రమేష్ గౌడ్ సూచనలతోనే ఈ సమస్య పరిష్కారమైందని తెలిపారు. తమ వార్డు ప్రజల ఇబ్బందులను గుర్తించి త్వరితగతిన కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేసిన ట్రాన్స్‌కో ఏఈకి, సిబ్బందికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.వార్డులో ఉన్న అన్ని ప్రజా సమస్యలను అంచెలంచెలుగా పరిష్కరించి ప్రజల మన్ననలు పొందుతాం. 17వ వార్డు పరిధిలో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా మా దృష్టికి తీసుకురావచ్చు. వాటిని తప్పకుండా పరిష్కరిస్తాం. అని కౌన్సిలర్ హామీ ఇచ్చారు.​ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మాదాని గోపాల్, సైదులు, ట్రాన్స్‌కో సిబ్బంది, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News