జర్నలిస్టు కుటుంబానికి బీఆర్ఎస్ భరోసా
జర్నలిస్టు కుటుంబానికి బీఆర్ఎస్ భరోసా
Komidala Mahender reddy
శేఖర్ గౌడ్ కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం.
అన్నెపర్తిలో పరామర్శించిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
నల్లగొండ, జూన్ 25:
జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు పాలకూరి శేఖర్ గౌడ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి . గురువారం అన్నెపర్తి గ్రామంలో శేఖర్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కూడా పాల్గొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ శేఖర్ గౌడ్ తెలంగాణ ఉద్యమంలోనూ, జర్నలిజం రంగంలోనూ విశిష్ట సేవలు అందించారని గుర్తుచేశారు. ఆయన మృతి జర్నలిస్టు లోకానికి తీరని లోటని పేర్కొన్నారు. శేఖర్ గౌడ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
క్లిష్ట సమయంలో అండగా నిలిచిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు , మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి జర్నలిస్టులు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఐబీసీ ఛానల్ ఎండీ ఏచూరి భాస్కర్ తో పాటు పలువురు జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జర్నలిస్టు కుటుంబానికి అండగా నిలిచిన పార్టీ నాయకత్వాన్ని వారు అభినందించారు. శేఖర్ గౌడ్ సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి