Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:20 AM

ప్రతిభకు ప్రోత్సాహం.. టాపర్లకు నగదు బహుమతులు

ప్రతిభకు ప్రోత్సాహం.. టాపర్లకు నగదు బహుమతులు

ప్రతిభకు ప్రోత్సాహం.. టాపర్లకు నగదు బహుమతులు
25-06-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, జూన్ 25:

చిట్యాల పట్టణంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గురువారం నగదు పురస్కారాలను అందజేశారు. పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త కొరివి వెంకన్న విద్యార్థులను అభినందించి బహుమతులు ప్రదానం చేశారు.పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానం పొందిన విద్యార్థికి రూ.20 వేల నగదు బహుమతి, ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థికి రూ.15 వేల నగదు బహుమతి, తృతీయ స్థానం పొందిన విద్యార్థికి రూ.10 వేల నగదు బహుమతిని అందించారు.

ఈ సందర్భంగా కొరివి వెంకన్న మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రతిభను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థుల విజయాలకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం ఎంతో కీలకమని అన్నారు.

నగదు పురస్కారాలు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతిభకు ప్రోత్సాహం.. టాపర్లకు నగదు బహుమతులు

Article Image

చిట్యాల, జూన్ 25:

చిట్యాల పట్టణంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గురువారం నగదు పురస్కారాలను అందజేశారు. పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త కొరివి వెంకన్న విద్యార్థులను అభినందించి బహుమతులు ప్రదానం చేశారు.పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానం పొందిన విద్యార్థికి రూ.20 వేల నగదు బహుమతి, ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థికి రూ.15 వేల నగదు బహుమతి, తృతీయ స్థానం పొందిన విద్యార్థికి రూ.10 వేల నగదు బహుమతిని అందించారు.

ఈ సందర్భంగా కొరివి వెంకన్న మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రతిభను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థుల విజయాలకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం ఎంతో కీలకమని అన్నారు.

నగదు పురస్కారాలు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News