ప్రతిభకు ప్రోత్సాహం.. టాపర్లకు నగదు బహుమతులు
ప్రతిభకు ప్రోత్సాహం.. టాపర్లకు నగదు బహుమతులు
Komidala Mahender reddy
చిట్యాల, జూన్ 25:
చిట్యాల పట్టణంలోని జడ్పీహెచ్ఎస్లో ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు గురువారం నగదు పురస్కారాలను అందజేశారు. పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త కొరివి వెంకన్న విద్యార్థులను అభినందించి బహుమతులు ప్రదానం చేశారు.పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానం పొందిన విద్యార్థికి రూ.20 వేల నగదు బహుమతి, ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థికి రూ.15 వేల నగదు బహుమతి, తృతీయ స్థానం పొందిన విద్యార్థికి రూ.10 వేల నగదు బహుమతిని అందించారు.
ఈ సందర్భంగా కొరివి వెంకన్న మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రతిభను ప్రోత్సహించడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థుల విజయాలకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం ఎంతో కీలకమని అన్నారు.
నగదు పురస్కారాలు అందుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి