Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపాలిటీ పరిధి 2వ వార్డులో ఘనంగా ఇంద్రమ్మ ఇల్లు ప్రారంభం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 10:29 PM

యువత భవితను బుగ్గిపాలు చేసే డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: సిఐ జి. మన్మధ కుమార్

యువత భవితను బుగ్గిపాలు చేసే డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: సిఐ జి. మన్మధ కుమార్

యువత భవితను బుగ్గిపాలు చేసే డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: సిఐ జి. మన్మధ కుమార్
June 25, 2026 09:00 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విద్యార్థులు మాదకద్రవ్యాల (డ్రగ్స్) మహమ్మారికి దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ పరిధిలోని దేవలమ్మ నాగారం ప్రభుత్వ విద్యాసంస్థలో గురువారం విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని, సోషల్ మీడియా ప్రలోభాలకు లోనుకాకుండా చదువు, క్రీడలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా, ప్రలోభపెట్టినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి మద్దతుగా విద్యార్థులతో 'మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ' చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు, పోలీసులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News