Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:14 AM

యువత భవితను బుగ్గిపాలు చేసే డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: సిఐ జి. మన్మధ కుమార్

యువత భవితను బుగ్గిపాలు చేసే డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: సిఐ జి. మన్మధ కుమార్

యువత భవితను బుగ్గిపాలు చేసే డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: సిఐ జి. మన్మధ కుమార్
25-06-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విద్యార్థులు మాదకద్రవ్యాల (డ్రగ్స్) మహమ్మారికి దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ పరిధిలోని దేవలమ్మ నాగారం ప్రభుత్వ విద్యాసంస్థలో గురువారం విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని, సోషల్ మీడియా ప్రలోభాలకు లోనుకాకుండా చదువు, క్రీడలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా, ప్రలోభపెట్టినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి మద్దతుగా విద్యార్థులతో 'మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ' చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు, పోలీసులు పాల్గొన్నారు.

Sthanikam

యువత భవితను బుగ్గిపాలు చేసే డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: సిఐ జి. మన్మధ కుమార్

Article Image

విద్యార్థులు మాదకద్రవ్యాల (డ్రగ్స్) మహమ్మారికి దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ పరిధిలోని దేవలమ్మ నాగారం ప్రభుత్వ విద్యాసంస్థలో గురువారం విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని, సోషల్ మీడియా ప్రలోభాలకు లోనుకాకుండా చదువు, క్రీడలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా, ప్రలోభపెట్టినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి మద్దతుగా విద్యార్థులతో 'మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ' చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు, పోలీసులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News