PRINT TIME: June 25, 2026 10:29 PM
యువత భవితను బుగ్గిపాలు చేసే డ్రగ్స్కు దూరంగా ఉండాలి: సిఐ జి. మన్మధ కుమార్
యువత భవితను బుగ్గిపాలు చేసే డ్రగ్స్కు దూరంగా ఉండాలి: సిఐ జి. మన్మధ కుమార్
June 25, 2026 09:00 PM
30 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
విద్యార్థులు మాదకద్రవ్యాల (డ్రగ్స్) మహమ్మారికి దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ పరిధిలోని దేవలమ్మ నాగారం ప్రభుత్వ విద్యాసంస్థలో గురువారం విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని, సోషల్ మీడియా ప్రలోభాలకు లోనుకాకుండా చదువు, క్రీడలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా, ప్రలోభపెట్టినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి మద్దతుగా విద్యార్థులతో 'మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ' చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థులు, పోలీసులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి