లంచం కేసులో చిక్కిన సబ్–రిజిస్ట్రార్కు మరో షాక్. రూ.5.05 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ
లంచం కేసులో చిక్కిన సబ్–రిజిస్ట్రార్కు మరో షాక్. రూ.5.05 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ
Editor Desk
బంగారం, వజ్రాభరణాలు, నగదు, ఫ్లాట్లు, వ్యవసాయ భూములు స్వాధీనం
రూ.30 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడి ఇప్పటికే సస్పెండ్ అయిన సబ్–రిజిస్ట్రార్ తుమ్మకొమ్మ సుచరితపై ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో స్థిర, చరాస్తులు వెలుగులోకి వచ్చాయి.
ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లాలో 2.17 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్లో మూడు ఫ్లాట్లు, రెండు ప్లాట్లు, వోక్స్వ్యాగన్, హ్యుందాయ్ క్రెటా కార్లు, సుమారు రూ.1.20 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు, రూ.12 లక్షల నగదు, రూ.38 లక్షల బ్యాంకు డిపాజిట్లు గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ సుమారు రూ.5.05 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.
లంచం కేసుతో పాటు ఆదాయానికి మించిన ఆస్తులపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు తెలిపారు. మరిన్ని ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి