Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 11:22 PM

లంచం కేసులో చిక్కిన సబ్‌–రిజిస్ట్రార్‌కు మరో షాక్. రూ.5.05 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ

లంచం కేసులో చిక్కిన సబ్‌–రిజిస్ట్రార్‌కు మరో షాక్. రూ.5.05 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ

లంచం కేసులో చిక్కిన సబ్‌–రిజిస్ట్రార్‌కు మరో షాక్.  రూ.5.05 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ
26-06-2026 106 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బంగారం, వజ్రాభరణాలు, నగదు, ఫ్లాట్లు, వ్యవసాయ భూములు స్వాధీనం

రూ.30 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడి ఇప్పటికే సస్పెండ్ అయిన సబ్‌–రిజిస్ట్రార్ తుమ్మకొమ్మ సుచరితపై ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో స్థిర, చరాస్తులు వెలుగులోకి వచ్చాయి.

ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లాలో 2.17 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో మూడు ఫ్లాట్లు, రెండు ప్లాట్లు, వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ క్రెటా కార్లు, సుమారు రూ.1.20 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు, రూ.12 లక్షల నగదు, రూ.38 లక్షల బ్యాంకు డిపాజిట్లు గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ సుమారు రూ.5.05 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.

లంచం కేసుతో పాటు ఆదాయానికి మించిన ఆస్తులపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు తెలిపారు. మరిన్ని ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Sthanikam

లంచం కేసులో చిక్కిన సబ్‌–రిజిస్ట్రార్‌కు మరో షాక్. రూ.5.05 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ

Article Image

బంగారం, వజ్రాభరణాలు, నగదు, ఫ్లాట్లు, వ్యవసాయ భూములు స్వాధీనం

రూ.30 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడి ఇప్పటికే సస్పెండ్ అయిన సబ్‌–రిజిస్ట్రార్ తుమ్మకొమ్మ సుచరితపై ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో స్థిర, చరాస్తులు వెలుగులోకి వచ్చాయి.

ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లాలో 2.17 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో మూడు ఫ్లాట్లు, రెండు ప్లాట్లు, వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ క్రెటా కార్లు, సుమారు రూ.1.20 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు, రూ.12 లక్షల నగదు, రూ.38 లక్షల బ్యాంకు డిపాజిట్లు గుర్తించారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ సుమారు రూ.5.05 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.

లంచం కేసుతో పాటు ఆదాయానికి మించిన ఆస్తులపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు తెలిపారు. మరిన్ని ఆస్తుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News