Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భక్తుల కోలాహలంతో వైభవంగా ముగిసిన బోరంచ మొహర్రం పీర్ల ఊరేగింపు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 26, 2026 07:54 PM

అర్ధరాత్రి దాటినా హోటళ్లు తెరిస్తే కఠిన చర్యలు: వనస్థలిపురం పోలీసులు

అర్ధరాత్రి దాటినా హోటళ్లు తెరిస్తే కఠిన చర్యలు: వనస్థలిపురం పోలీసులు

అర్ధరాత్రి దాటినా హోటళ్లు తెరిస్తే కఠిన చర్యలు: వనస్థలిపురం పోలీసులు
June 26, 2026 03:29 PM 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్‌బీనగర్: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి దాటినా హోటళ్లను నిర్వహిస్తున్న వారిపై వనస్థలిపురం పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన గంగా జామున హోటల్ (ఆటోనగర్) నిర్వాహకుడు మంటూ కుమార్ యాదవ్, మన స్వాగత్ హోటల్ (తుర్కయంజాల్) నిర్వాహకుడు రమేష్‌లకు కోర్టు ఐదు రోజుల కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించింది.

కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ, వీధుల పరిశుభ్రత వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. వీరిపై గతంలో కూడా ఇలాంటి కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, పాన్ షాపులు తదితర వాణిజ్య సంస్థలు ప్రభుత్వం నిర్దేశించిన సమయానికే మూసివేయాలని హెచ్చరించారు. సమయం దాటినా వ్యాపారాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News