Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:51 AM

అర్ధరాత్రి దాటినా హోటళ్లు తెరిస్తే కఠిన చర్యలు: వనస్థలిపురం పోలీసులు

అర్ధరాత్రి దాటినా హోటళ్లు తెరిస్తే కఠిన చర్యలు: వనస్థలిపురం పోలీసులు

అర్ధరాత్రి దాటినా హోటళ్లు తెరిస్తే కఠిన చర్యలు: వనస్థలిపురం పోలీసులు
26-06-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్‌బీనగర్: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి దాటినా హోటళ్లను నిర్వహిస్తున్న వారిపై వనస్థలిపురం పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన గంగా జామున హోటల్ (ఆటోనగర్) నిర్వాహకుడు మంటూ కుమార్ యాదవ్, మన స్వాగత్ హోటల్ (తుర్కయంజాల్) నిర్వాహకుడు రమేష్‌లకు కోర్టు ఐదు రోజుల కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించింది.

కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ, వీధుల పరిశుభ్రత వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. వీరిపై గతంలో కూడా ఇలాంటి కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, పాన్ షాపులు తదితర వాణిజ్య సంస్థలు ప్రభుత్వం నిర్దేశించిన సమయానికే మూసివేయాలని హెచ్చరించారు. సమయం దాటినా వ్యాపారాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Sthanikam

అర్ధరాత్రి దాటినా హోటళ్లు తెరిస్తే కఠిన చర్యలు: వనస్థలిపురం పోలీసులు

Article Image

ఎల్‌బీనగర్: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి దాటినా హోటళ్లను నిర్వహిస్తున్న వారిపై వనస్థలిపురం పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన గంగా జామున హోటల్ (ఆటోనగర్) నిర్వాహకుడు మంటూ కుమార్ యాదవ్, మన స్వాగత్ హోటల్ (తుర్కయంజాల్) నిర్వాహకుడు రమేష్‌లకు కోర్టు ఐదు రోజుల కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించింది.

కమ్యూనిటీ సర్వీస్‌లో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ, వీధుల పరిశుభ్రత వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. వీరిపై గతంలో కూడా ఇలాంటి కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, పాన్ షాపులు తదితర వాణిజ్య సంస్థలు ప్రభుత్వం నిర్దేశించిన సమయానికే మూసివేయాలని హెచ్చరించారు. సమయం దాటినా వ్యాపారాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News