అర్ధరాత్రి దాటినా హోటళ్లు తెరిస్తే కఠిన చర్యలు: వనస్థలిపురం పోలీసులు
అర్ధరాత్రి దాటినా హోటళ్లు తెరిస్తే కఠిన చర్యలు: వనస్థలిపురం పోలీసులు
Editor Desk
ఎల్బీనగర్: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి దాటినా హోటళ్లను నిర్వహిస్తున్న వారిపై వనస్థలిపురం పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన గంగా జామున హోటల్ (ఆటోనగర్) నిర్వాహకుడు మంటూ కుమార్ యాదవ్, మన స్వాగత్ హోటల్ (తుర్కయంజాల్) నిర్వాహకుడు రమేష్లకు కోర్టు ఐదు రోజుల కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించింది.
కమ్యూనిటీ సర్వీస్లో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ, వీధుల పరిశుభ్రత వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. వీరిపై గతంలో కూడా ఇలాంటి కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, పాన్ షాపులు తదితర వాణిజ్య సంస్థలు ప్రభుత్వం నిర్దేశించిన సమయానికే మూసివేయాలని హెచ్చరించారు. సమయం దాటినా వ్యాపారాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి