Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భక్తుల కోలాహలంతో వైభవంగా ముగిసిన బోరంచ మొహర్రం పీర్ల ఊరేగింపు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 26, 2026 07:51 PM

ముఖ్యమంత్రి దృష్టికి ఆదోని సమస్యలు చంద్రబాబును కలిసిన ఆదోని నియోజకవర్గ నాయకులు

ముఖ్యమంత్రి దృష్టికి ఆదోని సమస్యలు చంద్రబాబును కలిసిన ఆదోని నియోజకవర్గ నాయకులు

ముఖ్యమంత్రి దృష్టికి ఆదోని సమస్యలు చంద్రబాబును కలిసిన ఆదోని నియోజకవర్గ నాయకులు
June 26, 2026 12:04 PM 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఓవర్ బ్రిడ్జి, డిగ్రీ కళాశాల భవనం, ఇంటి పట్టాలపై వినతులు

మాధవరం, : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును మాధవరంలో ఆదోని నియోజకవర్గ నాయకులు కలిసి పలు ప్రజా సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోలినేని సూర్యనారాయణ, యువ నాయకులు మారుతి నాయుడు, భూపాల్ చౌదరి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి ఈ బృందంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆదోని పట్టణ రైల్వే పరిధిలో నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, పెద్ద హరివనం గ్రామంలోని ఆర్‌ అండ్‌ బి రోడ్డుపై వంతెన నిర్మాణం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.

అదేవిధంగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోలినేని సూర్యనారాయణ బసాపురం గ్రామంలో ప్రతిపాదిత వంతెన నిర్మాణానికి వెంటనే నిధులు విడుదల చేయాలని, గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు ఇంటి పట్టాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని వినతిపత్రం సమర్పించారు.

వినతులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. అవసరమైన నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News