ముఖ్యమంత్రి దృష్టికి ఆదోని సమస్యలు చంద్రబాబును కలిసిన ఆదోని నియోజకవర్గ నాయకులు
ముఖ్యమంత్రి దృష్టికి ఆదోని సమస్యలు చంద్రబాబును కలిసిన ఆదోని నియోజకవర్గ నాయకులు
Editor Desk
ఓవర్ బ్రిడ్జి, డిగ్రీ కళాశాల భవనం, ఇంటి పట్టాలపై వినతులు
మాధవరం, : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును మాధవరంలో ఆదోని నియోజకవర్గ నాయకులు కలిసి పలు ప్రజా సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోలినేని సూర్యనారాయణ, యువ నాయకులు మారుతి నాయుడు, భూపాల్ చౌదరి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి ఈ బృందంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆదోని పట్టణ రైల్వే పరిధిలో నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, పెద్ద హరివనం గ్రామంలోని ఆర్ అండ్ బి రోడ్డుపై వంతెన నిర్మాణం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.
అదేవిధంగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోలినేని సూర్యనారాయణ బసాపురం గ్రామంలో ప్రతిపాదిత వంతెన నిర్మాణానికి వెంటనే నిధులు విడుదల చేయాలని, గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు ఇంటి పట్టాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని వినతిపత్రం సమర్పించారు.
వినతులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. అవసరమైన నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి