Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:54 AM

ముఖ్యమంత్రి దృష్టికి ఆదోని సమస్యలు చంద్రబాబును కలిసిన ఆదోని నియోజకవర్గ నాయకులు

ముఖ్యమంత్రి దృష్టికి ఆదోని సమస్యలు చంద్రబాబును కలిసిన ఆదోని నియోజకవర్గ నాయకులు

ముఖ్యమంత్రి దృష్టికి ఆదోని సమస్యలు చంద్రబాబును కలిసిన ఆదోని నియోజకవర్గ నాయకులు
26-06-2026 111 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఓవర్ బ్రిడ్జి, డిగ్రీ కళాశాల భవనం, ఇంటి పట్టాలపై వినతులు

మాధవరం, : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును మాధవరంలో ఆదోని నియోజకవర్గ నాయకులు కలిసి పలు ప్రజా సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోలినేని సూర్యనారాయణ, యువ నాయకులు మారుతి నాయుడు, భూపాల్ చౌదరి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి ఈ బృందంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆదోని పట్టణ రైల్వే పరిధిలో నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, పెద్ద హరివనం గ్రామంలోని ఆర్‌ అండ్‌ బి రోడ్డుపై వంతెన నిర్మాణం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.

అదేవిధంగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోలినేని సూర్యనారాయణ బసాపురం గ్రామంలో ప్రతిపాదిత వంతెన నిర్మాణానికి వెంటనే నిధులు విడుదల చేయాలని, గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు ఇంటి పట్టాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని వినతిపత్రం సమర్పించారు.

వినతులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. అవసరమైన నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

Sthanikam

ముఖ్యమంత్రి దృష్టికి ఆదోని సమస్యలు చంద్రబాబును కలిసిన ఆదోని నియోజకవర్గ నాయకులు

Article Image

ఓవర్ బ్రిడ్జి, డిగ్రీ కళాశాల భవనం, ఇంటి పట్టాలపై వినతులు

మాధవరం, : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడును మాధవరంలో ఆదోని నియోజకవర్గ నాయకులు కలిసి పలు ప్రజా సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోలినేని సూర్యనారాయణ, యువ నాయకులు మారుతి నాయుడు, భూపాల్ చౌదరి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి ఈ బృందంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆదోని పట్టణ రైల్వే పరిధిలో నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, పెద్ద హరివనం గ్రామంలోని ఆర్‌ అండ్‌ బి రోడ్డుపై వంతెన నిర్మాణం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.

అదేవిధంగా రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోలినేని సూర్యనారాయణ బసాపురం గ్రామంలో ప్రతిపాదిత వంతెన నిర్మాణానికి వెంటనే నిధులు విడుదల చేయాలని, గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు ఇంటి పట్టాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని వినతిపత్రం సమర్పించారు.

వినతులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. అవసరమైన నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News