Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:49 AM

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో పర్యావరణ దినోత్సవం

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో పర్యావరణ దినోత్సవం

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో పర్యావరణ దినోత్సవం
05-06-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వీసీ ఘంటా చక్రపాణి విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ప్రొ. జి. రాంరెడ్డి స్మారక ప్రాంగణంలో జమ్మి మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను విద్యార్థులకు తప్పనిసరిగా బోధించాలని సూచించారు.

అనంతరం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కే . వియ్యన్న రావు ఆన్‌లైన్ ద్వారా పాల్గొని ‘ప్రకృతి–మన జీవితం’ అంశంపై ప్రసంగించారు.

కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. ఎల్. విజయకృష్ణారెడ్డి, ప్రొఫెసర్లు, డైరెక్టర్లు, డీన్లు, వివిధ విభాగాల అధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో పర్యావరణ దినోత్సవం

Article Image

హైదరాబాద్, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వీసీ ఘంటా చక్రపాణి విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ప్రొ. జి. రాంరెడ్డి స్మారక ప్రాంగణంలో జమ్మి మొక్కలను నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను విద్యార్థులకు తప్పనిసరిగా బోధించాలని సూచించారు.

అనంతరం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కే . వియ్యన్న రావు ఆన్‌లైన్ ద్వారా పాల్గొని ‘ప్రకృతి–మన జీవితం’ అంశంపై ప్రసంగించారు.

కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. ఎల్. విజయకృష్ణారెడ్డి, ప్రొఫెసర్లు, డైరెక్టర్లు, డీన్లు, వివిధ విభాగాల అధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News