అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో పర్యావరణ దినోత్సవం
అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో పర్యావరణ దినోత్సవం
Editor Desk
హైదరాబాద్, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వీసీ ఘంటా చక్రపాణి విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ప్రొ. జి. రాంరెడ్డి స్మారక ప్రాంగణంలో జమ్మి మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను విద్యార్థులకు తప్పనిసరిగా బోధించాలని సూచించారు.
అనంతరం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కే . వియ్యన్న రావు ఆన్లైన్ ద్వారా పాల్గొని ‘ప్రకృతి–మన జీవితం’ అంశంపై ప్రసంగించారు.
కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. ఎల్. విజయకృష్ణారెడ్డి, ప్రొఫెసర్లు, డైరెక్టర్లు, డీన్లు, వివిధ విభాగాల అధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి