ప్రజల సౌకర్యమే లక్ష్యం.. బోరంచలో హైటెక్స్ లైట్ల ప్రారంభం
ప్రజల సౌకర్యమే లక్ష్యం.. బోరంచలో హైటెక్స్ లైట్ల ప్రారంభం
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో మొహరం (పీర్ల) పండుగ సందర్భంగా గ్రామంలోని దూదేకుల మసీదు సమీపంలో, పాతాళగడ్డ సంగమేశ్వర ఆలయానికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన హైటెక్స్ లైట్లను గురువారం రాత్రి గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ లైటింగ్ వల్ల పండుగకు వచ్చే భక్తులు, గ్రామ ప్రజలు రాత్రి వేళల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా రాకపోకలు సాగించే అవకాశం కలిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి