Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజల భద్రతే లక్ష్యం.. ఎన్‌హెచ్-65 పనులను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 05, 2026 06:44 PM

ప్రజల సౌకర్యమే లక్ష్యం.. బోరంచలో హైటెక్స్ లైట్ల ప్రారంభం

ప్రజల సౌకర్యమే లక్ష్యం.. బోరంచలో హైటెక్స్ లైట్ల ప్రారంభం

ప్రజల సౌకర్యమే లక్ష్యం.. బోరంచలో హైటెక్స్ లైట్ల ప్రారంభం
June 05, 2026 05:34 PM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో మొహరం (పీర్ల) పండుగ సందర్భంగా గ్రామంలోని దూదేకుల మసీదు సమీపంలో, పాతాళగడ్డ సంగమేశ్వర ఆలయానికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన హైటెక్స్ లైట్లను గురువారం రాత్రి గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ లైటింగ్ వల్ల పండుగకు వచ్చే భక్తులు, గ్రామ ప్రజలు రాత్రి వేళల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా రాకపోకలు సాగించే అవకాశం కలిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News