మరవపల్లిలో ఉపాధి కూలీల సమస్యలపై వినతిపత్రం
మరవపల్లిలో ఉపాధి కూలీల సమస్యలపై వినతిపత్రం
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం K. మరవపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని ఉపాధి కూలీల పని ప్రదేశాన్ని సంఘం నాయకులు పర్యటించి కూలీల సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నారాయణ మాట్లాడుతూ, పాత పద్ధతిలో ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. కూలీలకు అవసరమైన పనిముట్లు, గడారు, పార, గంపలు అందించాలని తెలిపారు. పని ప్రదేశాల్లో తాగునీటి సదుపాయం, మజ్జిగ, మెడికల్ టాబ్లెట్స్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే ఉపాధి కూలీలకు రోజువారీ కూలీ రూ.600 చెల్లించాలని కోరుతూ గ్రామ సచివాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు వెంకట్రాముడు, K. గీతమ్మ, కౌసప్ప, హరీష్, సుశీలమ్మ, చంద్రకళ, రత్నమ్మ, ముత్తప్పతో పాటు పలువురు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి