Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:10 AM

మరవపల్లిలో ఉపాధి కూలీల సమస్యలపై వినతిపత్రం

మరవపల్లిలో ఉపాధి కూలీల సమస్యలపై వినతిపత్రం

మరవపల్లిలో ఉపాధి కూలీల సమస్యలపై వినతిపత్రం
04-06-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం K. మరవపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని ఉపాధి కూలీల పని ప్రదేశాన్ని సంఘం నాయకులు పర్యటించి కూలీల సమస్యలను తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నారాయణ మాట్లాడుతూ, పాత పద్ధతిలో ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. కూలీలకు అవసరమైన పనిముట్లు, గడారు, పార, గంపలు అందించాలని తెలిపారు. పని ప్రదేశాల్లో తాగునీటి సదుపాయం, మజ్జిగ, మెడికల్ టాబ్లెట్స్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.


అలాగే ఉపాధి కూలీలకు రోజువారీ కూలీ రూ.600 చెల్లించాలని కోరుతూ గ్రామ సచివాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు వెంకట్రాముడు, K. గీతమ్మ, కౌసప్ప, హరీష్, సుశీలమ్మ, చంద్రకళ, రత్నమ్మ, ముత్తప్పతో పాటు పలువురు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.


Sthanikam

మరవపల్లిలో ఉపాధి కూలీల సమస్యలపై వినతిపత్రం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం K. మరవపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని ఉపాధి కూలీల పని ప్రదేశాన్ని సంఘం నాయకులు పర్యటించి కూలీల సమస్యలను తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నారాయణ మాట్లాడుతూ, పాత పద్ధతిలో ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. కూలీలకు అవసరమైన పనిముట్లు, గడారు, పార, గంపలు అందించాలని తెలిపారు. పని ప్రదేశాల్లో తాగునీటి సదుపాయం, మజ్జిగ, మెడికల్ టాబ్లెట్స్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.


అలాగే ఉపాధి కూలీలకు రోజువారీ కూలీ రూ.600 చెల్లించాలని కోరుతూ గ్రామ సచివాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు వెంకట్రాముడు, K. గీతమ్మ, కౌసప్ప, హరీష్, సుశీలమ్మ, చంద్రకళ, రత్నమ్మ, ముత్తప్పతో పాటు పలువురు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News