Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గరిక ఉపేందర్ ను కలిసిన జిల్లా అధ్యక్షులు కుక్కల శ్రీనివాస్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 08:41 PM

మరవపల్లిలో ఉపాధి కూలీల సమస్యలపై వినతిపత్రం

మరవపల్లిలో ఉపాధి కూలీల సమస్యలపై వినతిపత్రం

మరవపల్లిలో ఉపాధి కూలీల సమస్యలపై వినతిపత్రం
June 04, 2026 07:14 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం K. మరవపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీల సమస్యలపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని ఉపాధి కూలీల పని ప్రదేశాన్ని సంఘం నాయకులు పర్యటించి కూలీల సమస్యలను తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నారాయణ మాట్లాడుతూ, పాత పద్ధతిలో ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. కూలీలకు అవసరమైన పనిముట్లు, గడారు, పార, గంపలు అందించాలని తెలిపారు. పని ప్రదేశాల్లో తాగునీటి సదుపాయం, మజ్జిగ, మెడికల్ టాబ్లెట్స్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.


అలాగే ఉపాధి కూలీలకు రోజువారీ కూలీ రూ.600 చెల్లించాలని కోరుతూ గ్రామ సచివాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు వెంకట్రాముడు, K. గీతమ్మ, కౌసప్ప, హరీష్, సుశీలమ్మ, చంద్రకళ, రత్నమ్మ, ముత్తప్పతో పాటు పలువురు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News