Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మంచేపల్లి మార్గంలో విషాదం.. అధికారుల నిర్లక్ష్యానికి అమాయక రైతు బలి! కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 12:57 PM

మంచేపల్లి మార్గంలో విషాదం.. అధికారుల నిర్లక్ష్యానికి అమాయక రైతు బలి!

మంచేపల్లి మార్గంలో విషాదం.. అధికారుల నిర్లక్ష్యానికి అమాయక రైతు బలి!

మంచేపల్లి మార్గంలో విషాదం.. అధికారుల నిర్లక్ష్యానికి అమాయక రైతు బలి!
June 04, 2026 09:30 AM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఓ రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మంచేపల్లి గ్రామానికి చెందిన రైతు బోయ అంజి, పశువులకు గడ్డి తీసుకుని ద్విచక్ర వాహనంపై వస్తుండగా కరెంటు స్తంభాన్ని ఢీకొని మృతిచెందారు.


బ్రాహ్మణపల్లి నుంచి మంచేపల్లి వెళ్లే మార్గంలో రాత్రివేళ దట్టమైన చెట్లు, పొదలు రోడ్డును పూర్తిగా కమ్మేయడంతో పాటు వీధి దీపాలు లేకపోవడం ప్రమాదానికి కారణమైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కారు చీకట్లో దారి కనిపించకపోవడంతో అంజి ప్రయాణిస్తున్న బైక్ నేరుగా కరెంటు స్తంభాన్ని ఢీకొట్టినట్లు తెలిపారు.


ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అంజిని చికిత్స కోసం తరలించేలోపే ఆయన మృతిచెందారు. అంజి మృతితో మంచేపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.


ఈ రహదారిపై ప్రతిరోజూ రైతులు, కూలీలు, గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లు, పొదలను తొలగించి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, లేకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News