నల్గొండ పట్టణంలోని శాంతినగర్లో శ్రీ రామాంజనేయ భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన నెలరోజుల భజన శిక్షణ కార్యక్రమం ఘనంగా ముగిసింది. శిక్షణ పొందిన మహిళలు వివిధ రూపాల్లో భజనలు, కోలాట ప్రదర్శనలు నిర్వహించి కాలనీవాసులను ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా 6 అడుగులు, 8 అడుగులు, 9 అడుగులు, 10 అడుగులు, 12 అడుగులు, 18 అడుగులు, 36 అడుగుల జడకొప్పులతో ప్రత్యేక భజన ప్రదర్శనలు నిర్వహించారు. భక్తి, సంప్రదాయం, సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా నిర్వహించిన ఈ కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
భజన గురువు సుంకబోయిన రామలింగం, సహ గురువు రామారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు నెలరోజుల పాటు శిక్షణ అందించారు. శాంతినగర్ కాలనీలోని సుమారు 30 మంది మహిళలు ఈ శిక్షణలో పాల్గొని భజన, కోలాట ప్రదర్శనల్లో తమ ప్రతిభను చాటారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు జూలకంటి సుధర్మ రెడ్డి, వెంకటమ్మలను నిర్వాహకులు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ రామాంజనేయ స్వామిపై భక్తి భావంతో మహిళలకు శిక్షణ అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారిని అభినందించారు.
కార్యక్రమంలో నాగులవంచ జ్యోతి, శ్వేత, జోష్ణ, దివ్యతో పాటు కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి