అతివేగం బలి తీసుకుంది.. డివైడర్ను ఢీకొన్న కారు, ఒకరు మృతి
అతివేగం బలి తీసుకుంది.. డివైడర్ను ఢీకొన్న కారు, ఒకరు మృతి
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా కట్టంగూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారి-65పై గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ప్రయాణికుల కారు అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న శివరాత్రి వేణు అక్కడికక్కడే మృతి చెందాడు.
మరో ఇద్దరు తీవ్ర గాయాలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఇదిలా ఉండగా, మృతుడు శివరాత్రి వేణుకు భార్య, ఒక కుమారుడు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి