Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:21 AM

అతివేగం బలి తీసుకుంది.. డివైడర్‌ను ఢీకొన్న కారు, ఒకరు మృతి

అతివేగం బలి తీసుకుంది.. డివైడర్‌ను ఢీకొన్న కారు, ఒకరు మృతి

అతివేగం బలి తీసుకుంది.. డివైడర్‌ను ఢీకొన్న కారు, ఒకరు మృతి
04-06-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా కట్టంగూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారి-65పై గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ప్రయాణికుల కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న శివరాత్రి వేణు అక్కడికక్కడే మృతి చెందాడు.

మరో ఇద్దరు తీవ్ర గాయాలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఇదిలా ఉండగా, మృతుడు శివరాత్రి వేణుకు భార్య, ఒక కుమారుడు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


Sthanikam

అతివేగం బలి తీసుకుంది.. డివైడర్‌ను ఢీకొన్న కారు, ఒకరు మృతి

Article Image

నల్గొండ జిల్లా కట్టంగూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారి-65పై గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ప్రయాణికుల కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న శివరాత్రి వేణు అక్కడికక్కడే మృతి చెందాడు.

మరో ఇద్దరు తీవ్ర గాయాలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఇదిలా ఉండగా, మృతుడు శివరాత్రి వేణుకు భార్య, ఒక కుమారుడు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News