Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మంచేపల్లి మార్గంలో విషాదం.. అధికారుల నిర్లక్ష్యానికి అమాయక రైతు బలి! కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 12:52 PM

రొద్దం మండల కేంద్రంలో నీటి లీకేజీ సమస్యపై ఆగ్రహం

రొద్దం మండల కేంద్రంలో నీటి లీకేజీ సమస్యపై ఆగ్రహం

రొద్దం మండల కేంద్రంలో నీటి లీకేజీ సమస్యపై ఆగ్రహం
June 04, 2026 09:31 AM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలో నీటి పైపుల లీకేజీ సమస్య రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ జిల్లా కార్యదర్శి నీరుగంటి వేణుగోపాల్ ఆరోపించారు. గ్రామం నడిబొడ్డున ప్రతిరోజూ నీటి పైపుల ద్వారా నీరు వృథాగా లీకవుతోందని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడం బాధాకరమన్నారు.


మండల ఎంపీడీవోతో పాటు సంబంధిత అధికారులు సమస్యను పరిశీలించడానికి కూడా రాకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర మంత్రి సవితమ్మ ఆదేశాలను కూడా రొద్దం మండల అధికారులు బేఖాతరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ప్రజా సమస్యలపై బాధ్యతగా వ్యవహరించాలని, వెంటనే ఘటన స్థలానికి చేరుకుని నీటి లీకేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని నీరుగంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News