రొద్దం మండల కేంద్రంలో నీటి లీకేజీ సమస్యపై ఆగ్రహం
రొద్దం మండల కేంద్రంలో నీటి లీకేజీ సమస్యపై ఆగ్రహం
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలో నీటి పైపుల లీకేజీ సమస్య రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ జిల్లా కార్యదర్శి నీరుగంటి వేణుగోపాల్ ఆరోపించారు. గ్రామం నడిబొడ్డున ప్రతిరోజూ నీటి పైపుల ద్వారా నీరు వృథాగా లీకవుతోందని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడం బాధాకరమన్నారు.
మండల ఎంపీడీవోతో పాటు సంబంధిత అధికారులు సమస్యను పరిశీలించడానికి కూడా రాకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర మంత్రి సవితమ్మ ఆదేశాలను కూడా రొద్దం మండల అధికారులు బేఖాతరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ప్రజా సమస్యలపై బాధ్యతగా వ్యవహరించాలని, వెంటనే ఘటన స్థలానికి చేరుకుని నీటి లీకేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని నీరుగంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి