Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:51 AM

కోసిగిలో అభివృద్ధి పనులకు ఊతం.. ప్రజల సమస్యల పరిష్కారానికి హామీ

కోసిగిలో అభివృద్ధి పనులకు ఊతం.. ప్రజల సమస్యల పరిష్కారానికి హామీ

కోసిగిలో అభివృద్ధి పనులకు ఊతం.. ప్రజల సమస్యల పరిష్కారానికి హామీ
04-06-2026 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కోసిగి: డా. బి.ఆర్. అంబేద్కర్ మహావిగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో కోసిగి పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు. కార్యక్రమానికి వచ్చిన విశేష స్పందనతో పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక సంక్షేమ కార్యక్రమాల అమలుకు మరింత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్, మంత్రాలయం టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అణగారిన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం కృషి కొనసాగుతుందని తెలిపారు. కోసిగి మండలంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

అంబేద్కర్ మహావిగ్రహం ఏర్పాటు కోసిగి చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని, ఇది యువతకు స్ఫూర్తినిచ్చే కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో మరిన్ని సామాజిక, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన ప్రజలు, మహిళలు, యువత, విద్యార్థులు, సామాజిక సంఘాలు, రాజకీయ నాయకులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

కోసిగిలో అభివృద్ధి పనులకు ఊతం.. ప్రజల సమస్యల పరిష్కారానికి హామీ

Article Image

కోసిగి: డా. బి.ఆర్. అంబేద్కర్ మహావిగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో కోసిగి పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు. కార్యక్రమానికి వచ్చిన విశేష స్పందనతో పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక సంక్షేమ కార్యక్రమాల అమలుకు మరింత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్, మంత్రాలయం టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అణగారిన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం కృషి కొనసాగుతుందని తెలిపారు. కోసిగి మండలంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

అంబేద్కర్ మహావిగ్రహం ఏర్పాటు కోసిగి చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని, ఇది యువతకు స్ఫూర్తినిచ్చే కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో మరిన్ని సామాజిక, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన ప్రజలు, మహిళలు, యువత, విద్యార్థులు, సామాజిక సంఘాలు, రాజకీయ నాయకులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News