Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మంచేపల్లి మార్గంలో విషాదం.. అధికారుల నిర్లక్ష్యానికి అమాయక రైతు బలి! కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 04:59 PM

ఉద్యోగుల హక్కుల కోసం పోరాడిన భిక్షమయ్యకు ఘన వీడ్కోలు

ఉద్యోగుల హక్కుల కోసం పోరాడిన భిక్షమయ్యకు ఘన వీడ్కోలు

ఉద్యోగుల హక్కుల కోసం పోరాడిన భిక్షమయ్యకు ఘన వీడ్కోలు
June 04, 2026 02:18 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, : ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం మూడు దశాబ్దాలకుపైగా సేవలందించిన తెలంగాణ నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏనుగుల భిక్షమయ్య పదవీ విరమణ సభ బుధవారం నల్గొండలోని టీఎన్‌జీఓఎస్ జిల్లా భవనంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా జేఏసీ చైర్మన్ నాగిళ్ల మురళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా స్థాయి ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్య నాయక్ మాట్లాడుతూ, భిక్షమయ్య ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు. సంఘ బలోపేతానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

జిల్లా టిబి కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ సంజీవయ్య, డాక్టర్ రవి ప్రసాద్, డీటీడీవో, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అధికారులు మాట్లాడుతూ, 35 సంవత్సరాల పాటు ఆఫీస్ సబార్డినేట్‌గా విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగులకు అండగా నిలిచిన భిక్షమయ్య సేవలను ప్రశంసించారు.

అనంతరం భిక్షమయ్యను ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించారు. తన ఉద్యోగ జీవితంలో సహకరించిన అధికారులు, సహోద్యోగులు, సంఘ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో టీఎన్‌జీఓఎస్ నాయకులు మనోజ్ ప్రదీప్, లక్ష్మయ్య, ప్రణాదేవి, సత్యనారాయణ, అంజనేయులు, రమ్యసుధ, సుమలత, డీఐ రాజు, జయరావు, భాస్కర్ పాల్గొన్నారు. అలాగే ఐఎన్‌టీయూసీ నాయకుడు బిక్షం, తెలంగాణ నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు మణికుమార్, రాజమల్లయ్య, రాజయ్య, వెంకన్న, సుశీల, రేణుక తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News