Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:53 AM

ఉద్యోగుల హక్కుల కోసం పోరాడిన భిక్షమయ్యకు ఘన వీడ్కోలు

ఉద్యోగుల హక్కుల కోసం పోరాడిన భిక్షమయ్యకు ఘన వీడ్కోలు

ఉద్యోగుల హక్కుల కోసం పోరాడిన భిక్షమయ్యకు ఘన వీడ్కోలు
04-06-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, : ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం మూడు దశాబ్దాలకుపైగా సేవలందించిన తెలంగాణ నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏనుగుల భిక్షమయ్య పదవీ విరమణ సభ బుధవారం నల్గొండలోని టీఎన్‌జీఓఎస్ జిల్లా భవనంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా జేఏసీ చైర్మన్ నాగిళ్ల మురళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా స్థాయి ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్య నాయక్ మాట్లాడుతూ, భిక్షమయ్య ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు. సంఘ బలోపేతానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

జిల్లా టిబి కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ సంజీవయ్య, డాక్టర్ రవి ప్రసాద్, డీటీడీవో, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అధికారులు మాట్లాడుతూ, 35 సంవత్సరాల పాటు ఆఫీస్ సబార్డినేట్‌గా విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగులకు అండగా నిలిచిన భిక్షమయ్య సేవలను ప్రశంసించారు.

అనంతరం భిక్షమయ్యను ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించారు. తన ఉద్యోగ జీవితంలో సహకరించిన అధికారులు, సహోద్యోగులు, సంఘ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో టీఎన్‌జీఓఎస్ నాయకులు మనోజ్ ప్రదీప్, లక్ష్మయ్య, ప్రణాదేవి, సత్యనారాయణ, అంజనేయులు, రమ్యసుధ, సుమలత, డీఐ రాజు, జయరావు, భాస్కర్ పాల్గొన్నారు. అలాగే ఐఎన్‌టీయూసీ నాయకుడు బిక్షం, తెలంగాణ నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు మణికుమార్, రాజమల్లయ్య, రాజయ్య, వెంకన్న, సుశీల, రేణుక తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

ఉద్యోగుల హక్కుల కోసం పోరాడిన భిక్షమయ్యకు ఘన వీడ్కోలు

Article Image

నల్గొండ, : ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం మూడు దశాబ్దాలకుపైగా సేవలందించిన తెలంగాణ నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏనుగుల భిక్షమయ్య పదవీ విరమణ సభ బుధవారం నల్గొండలోని టీఎన్‌జీఓఎస్ జిల్లా భవనంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా జేఏసీ చైర్మన్ నాగిళ్ల మురళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా స్థాయి ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్య నాయక్ మాట్లాడుతూ, భిక్షమయ్య ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు. సంఘ బలోపేతానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

జిల్లా టిబి కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ సంజీవయ్య, డాక్టర్ రవి ప్రసాద్, డీటీడీవో, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అధికారులు మాట్లాడుతూ, 35 సంవత్సరాల పాటు ఆఫీస్ సబార్డినేట్‌గా విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగులకు అండగా నిలిచిన భిక్షమయ్య సేవలను ప్రశంసించారు.

అనంతరం భిక్షమయ్యను ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించారు. తన ఉద్యోగ జీవితంలో సహకరించిన అధికారులు, సహోద్యోగులు, సంఘ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో టీఎన్‌జీఓఎస్ నాయకులు మనోజ్ ప్రదీప్, లక్ష్మయ్య, ప్రణాదేవి, సత్యనారాయణ, అంజనేయులు, రమ్యసుధ, సుమలత, డీఐ రాజు, జయరావు, భాస్కర్ పాల్గొన్నారు. అలాగే ఐఎన్‌టీయూసీ నాయకుడు బిక్షం, తెలంగాణ నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు మణికుమార్, రాజమల్లయ్య, రాజయ్య, వెంకన్న, సుశీల, రేణుక తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News